వార్త‌లు

భవన నిర్మాణ కార్మికులు ఐక్యమత్యమే సమస్యలకు పరిష్కారం

భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) సమావేశం స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో య ర్రా మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఇటు వల మృతి చెందిన కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]

వార్త‌లు

“ఇదే అసలైన టీమ్ స్పిరిట్ – సీఎం చంద్రబాబు”

రాష్ట్రస్థాయి గుర్తింపు – జిల్లా గర్వకారణం మొంథా తుఫాన్ ఫైటర్లకు అభినందనలు — మంత్రి కందుల దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌. మాధవరావుకు ప్రశంస పత్రాలు అమరావతిలో శనివారం జరిగిన మొంథా తుఫాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 137 మంది అధికారులకు మెమెంటోలు, ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా

వార్త‌లు

తుపాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల మొంథా తుపాను కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకు చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావం ఉంటుందుని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి

వార్త‌లు

ప్రైవేట్ ఆసుపత్రుల యందు డా. ఎన్టీఆర్ వైద్య సేవలు యధాతధం

గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించిన సమ్మె ప్రభుత్వం తో చర్చలు సఫలమవడంతో, శనివారం నుండి డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల యందు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఉచిత వైద్య సేవలను యథావిధిగా పొందగలరనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 45 ప్రైవేట్ ఆసుపత్రులు

వార్త‌లు

జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పకడ్బందీగా నిర్వహణ

జిల్లాలో 2,35,031 మంది లబ్ధిదారులకు రూ.103.17 కోట్ల మేర పంపిణీకి ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెరిగిన రేటుతో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవు తుందని తెలియ చేశారు. వృద్ధాప్యులు, వితంతువులు, నేతకార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, దప్పు

వార్త‌లు

నిడదవోలు ఆర్వోబీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిడదవోలు పట్టణంలో రూ.184.74 కోట్లతో శరవేగంగా జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోబీ నిర్మాణ మ్యాప్ ను సునిశితంగా చూశారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడగగా 65 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం డ్రైన్

వార్త‌లు

మొంథా సైక్లోన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ:మంత్రి కందుల దుర్గేష్

మొంథా తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు నిడదవోలు మండలంలోని పెండ్యాలలో 44 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పంచదార, లీటర్ ఆయిల్ స్వయంగా పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో 23 గ్రామాలకు చెందిన 312 కుటుంబాల్లోని 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్..వారందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని

వార్త‌లు

కానూరు – ఉసులుమర్రు రోడ్డుకు రూ.3 కోట్ల నిధులు

తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తాము నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ భారీ వర్షాలు, మొంథా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు– ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిన్నదని, రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం

వార్త‌లు

తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ ఉద్యమ పోరాటాల ఫలితమే దేశంలో కార్మిక చట్టాలు…

తణుకులో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు… తణుకు,అక్టోబరు 31దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31 న బొంబాయి నగరంలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ నిర్విరామంగా నిర్వహించిన కార్మికోద్యమాలు,పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు,చట్టాలు సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. ఏఐటీయూసీ 106 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం తణుకులో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాలను

వార్త‌లు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్ ప్రాంగణమందు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ పటేల్ జన్మదిన జాతీయ ఐక్యత దినోత్సవం భారతదేశ తొలి హోం మంత్రి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి నారాయణరావు మాట్లాడుతూ మాట్లాడుతూ స్వాతంత్ర సమాజ యోధుడు రాజానీతిజ్ఞడు ,

Scroll to Top