స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు వీనుల విందుగా జరిగినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాల ప్రాంగణంలో పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. చిట్టి పొట్టి చిన్నారులు అందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి, ముగ్గులలో గొబ్బెమ్మలు అలంకరించి “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో” అంటూ పలు కీర్తనలను ఆలపించారు. వివిధ వేషధారణాలతో విద్యార్థినీ, విద్యార్థులు చూపరులను అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు ఉత్సవాన్ని నిర్వహించి, మన సాంప్రదాయ పిండి వంటలతో మరియు శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అద్భుతమైన అలంకరణతో చూపరులను ఆకట్టుకున్నారు.
కనుమరుగవుతున్న మన సంస్కృతీ సంప్రదాయాలను, పండుగ శోభను నేటి తరానికి తెలియజేయడం కోసం పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించామని, ఇటువంటి సంబరాలను ప్రోత్సహించటం ద్వారా పిల్లలకు పండుగ విశిష్టత తెలియజెప్పటం పెద్దలందరి బాధ్యత అంటూ స్కూల్ డైరెక్టర్ బి. విద్యాకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్స్ ఎల్.కె.త్రిపాఠి, బి. విద్యాకాంత్, ఎన్. సుధాకర్వర్మ మరియు ప్రైమరీ ప్రిన్సిపాల్ టి.సంధ్యా, డి. పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.


