ఆధ్యాత్మికం

2లక్షల రూపాయలు విరాళం.

తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ ముడియాలమ్మ, మహాలక్ష్మి దేవాలయం అభివృద్ధి కొరకు గ్రామానికి చెందిన ముళ్ళపూడి నారాయణరావు ఆలయ ప్రాంగణానికి టైల్స్ వేయుట నిమిత్తం 2లక్షల రూపాయలు విరాళంగాఅందచేశారు. ఆలయ ప్రాoగణంలో జరుగు పనుల నిర్మాణానికి ముళ్ళపూడి నారాయణరావు శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలోకూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

మత సామరస్యాన్ని కాపాడే రంజాన్‌

1500 కుటుంబాలకు రంజాన్‌ తోఫా అత్తిలిలో ఇఫ్తార్‌ విందులో రాధాకృష్ణ హామీ నియోజవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు మత సామరస్యాన్ని కాపాడుతూ అకుంఠితమైన దీక్షతో ముస్లింలు ఉపవాసం ఉండి అల్లా ఆశీస్సులు సమాజానికి తోడుగా ఉండాలని ముస్లిం సోదరులు కోరుకుంటారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం అత్తిలిలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు

ఆధ్యాత్మికం

ఘనంగా  గోపూజ – భూమి సుపోషణ మహోత్సవం 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఖండ పరిధిలోని గణపవరం మండలం వాకపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి వారి సన్నిధిలో శుక్రవారం గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గోపూజ, భూమి సుపోషణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ వికాస్ గోదావరి విభాగ్ సంయోజక్  చింతాకుల గోపాలకృష్ణ, ఖండ సహ సంయోజక్ సాధనాల శ్రీనివాస్, వాకపల్లి కమిటీ సభ్యుడు నండూరి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక ముఖ్య అతిథిగా

ఆధ్యాత్మికం

అత్యంత వైభవంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం

మహిమాన్విత వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఆదివారం తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా ఆలయపురోహితులు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి వారిని పురవీధుల్లో గ్రామోత్సవం జరిపి అనంతరం కళ్యాణ వేదికవద్ద కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్, ఉమ్మడి ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, తణుకు పట్టణ స్వర్ణకారసంఘ అధ్యక్షుడు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, కోశాధికారి వెండి శ్రీను, ఆలయ

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధవిహారలో నూతన ఆలయ కలశస్థాపన

ఉభయ తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ క్షేత్రంగా  ప్రసిద్ధి చెందుతున్న తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో గల బౌద్ధ దమ్మపీఠం యందు మైత్రేయ బుద్ధవిహారలో నిర్మితమవుతున్న బౌద్ధ ఆలయం కలస ప్రతిష్టాపన మహోత్సవం జనవరి 25 ఆదివారం జరగనున్న సందర్భంగా శుక్రవారం  పీఠాధిపతి బంతే అనాలియో పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న బౌద్ధాలయంలో ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో

ఆధ్యాత్మికం

శ్రీ దానేశ్వరి అమ్మవారికి 1లక్ష 116 రూపాయలు విరాళం

దువ్వ గ్రామములో వేంచేసిన శ్రీ దానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ పునర్నిర్మాణం కొరకు ముళ్ళపూడి నారాయణరావు ఆలయ అభివృద్ధి కొరకు ఒక లక్ష 116రూపాయలును ఆలయ ఛైర్మెన్ ప్రత్తి రామకృష్ణకి అందచేశారు. అనంతరం దువ్వ గ్రామంలో తాపీ మేస్త్రి బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవన అభివృద్ధి కొరకు 50వేల రూపాయలను యూనియన్ చైర్మెన్ జానపాముల శ్రీనుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గసభ్యులు, గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

శివ ముక్కోటి సందర్భంగా పాలంగి రామేశ్వరాలయంలో అన్నాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివముక్కోటి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నాభిషేకం నిర్వహించినట్లు అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించినట్లు ఈవో రామయ్య తెలియజేశారు.

ఆధ్యాత్మికం

గోకర్ణేశ్వరుని ఆలయంలో శివముక్కోటి కి ప్రత్యేక అభిషేకాలు

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న బ్రహ్మసూత్ర ప్రతిష్ట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసం శివ ముక్కోటి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలియజేశారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో శనివారం ఉదయం నుండి భక్తులు

ఆధ్యాత్మికం

ఉండ్రాజవరంలో అయ్యప్పస్వాముల అఖండ అన్నసమారాధన

ఉండ్రాజవరం గ్రామంలో అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని అయ్యప్ప దీక్షదారులు గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అఖండ అన్న సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష పీఠం గురుస్వామి చక్రవర్తుల లక్ష్మణాచార్యులు (రాజా స్వామీ) ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ అన్న సమారాధన కార్యక్రమం ఉదయం 12 గంటల నుండి ప్రారంభమై మూడు గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి

Scroll to Top