ప్రత్యేకం

ప్రాణాంతక రక్త వ్యాధులకు మూలకణ మార్పిడితో శాశ్వత పరిష్కారం.. వైద్యరంగంలో సరికొత్త ఆశలు!

తణుకు :చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న థలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్యవిధానమైన మూలకణ మార్పిడితో (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్) పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని దేశంలోనే అగ్రగామి హెమటో ఆంకాలజిస్ట్, సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యుడు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వైద్యరంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యంత క్లిష్టమైన కేసులను సైతం సునాయాసంగా ఛేదించే అశోక్ కుమార్.. ఇప్పటి వరకు 475 కు పైగా విజయవంతమైన […]

ప్రత్యేకం

తల్లిపాలు బిడ్డకు అపరసంజీవని

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక వేద హాస్పటల్ ప్రాంగణమందు తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అపరసంజీవని అన్నారు.స్త్రీల ప్రసూతి వైద్యనిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతి మాట్లాడుతూ సురక్ష తల్లి రొమ్ముపాలు అని, నవజాత శిశువు జన్మించిన వెంటనే అమృత ఆహారంగా రొమ్ముపాలను విధిగా పట్టించాలని అన్నారు. అనంతరం స్త్రీల ప్రసూతి వైద్య నిపుణురాలు రెడ్డి వేదవతిని, లోటస్ పిల్లల హాస్పటల్ మేనేజ్

ప్రత్యేకం

ఆకాశవాణి 90 వసంతాల విశిష్టత వైభవం

సాహితీ సామ్రాజ్యం అధ్వర్యంలో తణుకు స్థానిక నన్నయ భట్టారక పీఠం వద్ద ఉన్న మహిళాశాఖాగ్రంథాలయ ప్రాంగణమందు ఆకాశవాణి 90 వసంతాల వేడుకలో భాగంగా ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాల ఆవిర్భవ దినోత్సవం ఘనంగా మంగళవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ఆకాశవాణి 8 జూన్ 1936 న ఆవిర్భవించిందని, 16జూన్ 1938 న తొలి తెలుగు ప్రసారాలు ప్రారభమయినాయని, ప్రపంచంలోని అతిపెద్ద రేడియో వ్యవస్థలలో ఒకటి అని అన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో

ప్రత్యేకం

సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలు చిరస్మరణీయం: మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళి

గోదావరి జిల్లాల భాగ్యవిధాత, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్:మంత్రి దుర్గేష్ 223వ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా స్మరించుకున్న మంత్రి దుర్గేష్ నిడదవోలు: గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి, కోటి ఎకరాల మాగాణానికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజా సేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాటన్

ప్రత్యేకం

తణుకు కార్గో కార్యాలయంలో చల్లని మంచినీళ్ల చలివేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు కార్గో కార్యాలయంలో తణుకు లావణ్య ఫీడ్స్ యజమాని కోసూరి సతీష్ వర్మ ఆర్థిక సహాయంతో చల్లని మంచినీళ్ల చలివేంద్రం ను డిపో మేనేజర్ A. D. L.సుధారాణి ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా కార్గో వినియోగదారులు మరియు హమాలీలు ఆపరేటర్ల వేసవి దాహార్తిని తీర్చడానికి సతీష్ వర్మ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఇది చాలా అభినందనీయమని అన్నారు. ఈరోజు సతీష్ వర్మ కుమారుని పుట్టినరోజు సందర్భంగా రహదారి ప్రమాదంలో

ప్రత్యేకం

నిజామాబాద్ కు చెందిన అపర దానకర్ణుడు రాజా” నర్సాగౌడ్”

అతడు నిజామాబాద్ కు చెందిన అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి, ముఖ్యంగా కుష్టు వ్యాధితో బాధపడేవారి కోసం విక్టోరియా ఆస్పత్రిని స్థాపించడం లో ప్రధాన పాత్ర వహించారు. సమాజిక సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన చేసిన విశేష కృషికి పేరుగాంచారు. ప్రముఖ రచయిత డా. పి. కేశవరెడ్డి గారు పాండిచ్చేరి యూనివర్సిటీలో తన ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలోనే వైద్యునిగా చివరివరకు పనిచేశారు. ఈ రోజు రాజా

ప్రత్యేకం

ద్వారకాతిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అల్తి సత్యనారాయణ

అత్తిలి  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అత్తిలి పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు ఆల్తి సత్యనారాయణ నియామకం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీను నమ్ముకుని ఉంటున్న కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవం అని కొనియాడారు. గత 35

ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి 

చారిత్రాత్మకంగా అమరావతి శాశ్వత రాజధాని నిలిచిపోతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్‌ 6, 2026 చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని అన్నారు. అమరావతి శాశ్వత రాజధాని గెజిట్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడం హర్షణీయమన్నారు. 2014 పునర్విభజన చట్టం సవరించి పార్లమెంటు ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేకం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తణుకు శ్రీ మారుతీ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం తెలుగు భాష సాంస్కృతిక కలల వేదిక సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ కళాత్మక రూపంలో వర్ణించేదే కవిత అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కవిత్వం లేని భాష లేదు అందని భావం లేదు అని అన్నారు. ఈ

ప్రత్యేకం

గొప్ప దార్శనికురాలు మొల్లమాంబ – కారుమూరి నాగేశ్వరరావు

తణుకు – సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి ‘‘మొల్లమాంబ’’ గొప్ప దార్శనికురాలని మాజీమంత్రి శ్రీ డా.కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.శుక్రవారం ఆమె జయంతిని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్క్ సమీపంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక

Scroll to Top