తణుకులో యువనేత ముందస్తు పుట్టినరోజు వేడుకలు
వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలను గురువారం రాత్రి తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి వేడుకలను వినూత్న రీతిలో ప్రారంభించారు. నరేంద్ర సెంటర్ వద్ద 30 అడుగుల లోకేష్ కట్ అవుట్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు అగ్నికణమై ప్రజ్వరిల్లుతూ నవ్యాంధ్రప్రదేశ్ కు నలువైపుల వెలుగునిస్తున్నారని అన్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధికి తనదైన ముద్ర వేస్తూ, తాత నందమూరి తారకరామారావు, తండ్రి నారా చంద్రబాబు నాయుడుల ఆశయాలను, దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో యువత, మహిళల, విద్యార్థుల సాధికారికతకు నిరంతరం కృషి చేస్తున్నారనీ అన్నారు. ఐటి రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్న మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




