వార్త‌లు

వివాహిత చంటిబిడ్డతో పరారీ

ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామానికి చెందిన వివాహిత చింతపల్లి హేమశ్రీ (22) గురువారం రాత్రి తొమ్మిది నెలల చంటి బిడ్డతో అత్తవారి ఇంటి వద్ద నుండి పరారీ అయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ విషయమై ఆమె భర్త చింతపల్లి ఏసు ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేయగా పి ఎస్ ఐ నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వార్త‌లు

తణుకు పోలీసులచే అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

తణుకులో సంచలనం సృష్టించిన దోపిడి ఘటనలో పదిమంది అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసిన తణుకు పోలీసులు. తణుకులో శుక్రవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డిఎస్పి విశ్వనాధ్. సెప్టెంబర్ నెల 26న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు, రూ. 70 వేలు నగదు అపహరణ చేసి పరారు అయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు

వార్త‌లు

క్యాన్సర్ నివారణ పై అవగాహన తీసుకురావాలి

క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు కారణంగా క్యాన్సర్ విస్తరిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. తణుకు వీకే కన్వెన్షన్ హాల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ అధ్యక్షులుగా కలగర వెంకటకృష్ణ

వార్త‌లు

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి – తాడేపల్లిగూడెం జి.ఆర్.పి.ఎస్.ఐ.

అక్టోబర్ 5వ మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో నిడదవోలు రైల్వే స్టేషన్ యార్డ్ చిన్నకాశీరేవు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఎవరో గుర్తుతెలియని సుమారు 55 నుంచి 60 సంవత్సారాలు వయస్సు గల గుర్తుతెలియని పురుషుడు గుర్తు తెలియని దిగువకుపోవు (రాజమండ్రీ వైపు) రైలు బండి ఢీకొట్టి గాయాలతో మృతి చెందినట్లు, మృతుని వివరాలు తెలియరానట్లు, మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచినట్లు, మృతుడు: 1) ఎరుపు రంగు గళ్ళు చొక్కా మరియు,

వార్త‌లు

లయన్స్ ప్రపంచ వ్యాప్త సేవా వారోత్సవాలు

లయన్ విజన్: ప్రపంచ వ్యాప్త సేవా వారోత్సవాల సందర్భంగా ఆదివారం లయన్స్ జిల్లా 316 G ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ పైన అవగాహన సదస్సు తణుకు లిటిల్ పారడైజ్ స్కూల్లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ లైన్ వంక రాజకుమారి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమాన్ని ఫాస్ట్ గవర్నర్ Pdg లైన్ మాదిరెడ్డి బాబుజీ రావు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో Guest of Honor గా లైన్స్ మాజీ

వార్త‌లు

జాతీయ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలు

అక్టోబర్ 4 నుంచి 12 వరకు మానసిక ఆరోగ్యం అవగాహన వారోత్సవాలు జాతీయ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఆదేశానుసారం 4 తేదీన శనివారం మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ తణుకు బ్రాంచ్ లో పిపిఎఐ జాతీయ సెక్రటరీ డా. పి.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిపిఎఐ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డా.

వార్త‌లు

ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండవ మహాసభ.

ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండో మహాసభలు తణుకు అమరవీరుల స్మారక భవనంలో ఆదివారం నాడు జరిగాయి. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సి.హెచ్.సుందరయ్య మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలు కోసం కొత్త బస్సులు ఏర్పాటు నిధులు కేటాయింపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అవసరమైన సిబ్బంది

వార్త‌లు

జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు చాలా ప్రయోజనం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్‌ జిఎస్టి – సూపర్‌ సేవింగ్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10 నుంచి రూ. 15 వేలు వరకు ఆదా అవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులకు సైతం అమ్మకాలు

వార్త‌లు

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది

అమరావతి: ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇది తాత్కాలిక

వార్త‌లు

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలి – మోర్త సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వరప్రసాద్

రైతులకు అవసరమైన అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మోర్త గ్రామంలో సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వర ప్రసాద్ అధ్యక్షతన గ్రామ రైతులకు నిర్వహించిన జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, బయో పెస్టిసైడ్, పాల క్యాన్స్, ఆక్వా పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు 12 శాతం నుండి

Scroll to Top