వార్త‌లు

భారతరత్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ 123వ జయంతి

రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఈ రోజు మనం స్మరించుకుంటున్న మహానుభావుడు, భారతరత్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక శాశ్వత స్ఫూర్తి. ఆయన జీవితం ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక న్యాయ స్థాపనకు, దేశనిర్మాణానికి అంకితమైన ఒక నిరంతర యాత్ర అని తెలిపారు. జయప్రకాశ్ నారాయణ స్వాతంత్ర్య సమర యోధుడిగా, సర్వోదయ ఉద్యమం ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని ఐక్యపరచి, సేవ, సహకారం, సత్యం అనే విలువలతో కూడిన జీవన విధానాన్ని […]

వార్త‌లు

ఆలయాల అభివృద్ధికి ట్రస్టు బోర్డు కృషి చేయాలి

నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆలయాల అభివృద్ధికి నూతనంగా ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు పట్టణంలో వేంచేసిన కేశవస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీనటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ట్రస్ట్ బోర్డు సభ్యులకు

వార్త‌లు

తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బార్లు, మద్యం దుకాణాల తనిఖీ

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 38 మద్యం దుకాణాలను మరియు 3 బార్లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పదంగా గల సంఘటనలు ఏమియు నమోదు కాలేదని, అన్ని మద్యం షాపులు, బార్ల

వార్త‌లు

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యసేవలు

ప్రభుత్వాసుపత్రిలో నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ వివినికిడి సమస్య కోసం బెరా అత్యాధునిక పరికరం ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక యాపిల్ ఆసుపత్రి సహకారంతో మూత్రపిండాల సమస్యకు సంబంధించి వైద్యులను కన్సల్టెంట్ గా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగాన్ని ప్రారంభించిన

వార్త‌లు

పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్న విద్యానిధి ట్రస్ట్

ఉపకార వేతనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు విద్యానిధి ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న దాతలను పూర్తిగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్

వార్త‌లు

వైసిపి ప్రభుత్వ హయాంలో అత్తిలి ఏఎంసీ నిర్లక్ష్యం

నిధులను సైతం మళ్లించిన గత ప్రభుత్వ పెద్దలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు అత్తిలి ఏఎంసి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే గత వైసిపి ప్రభుత్వ హయాంలో అత్తిలి మార్కెట్ కమిటీ పరిధిలోని పుంత రోడ్లను నిర్లక్ష్యం చేసి ఎఎంసి అభివృద్ధికి విఘాతం కలిగించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం శనివారం చైర్మన్ దాసం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తణుకు ఎమ్మెల్యే

వార్త‌లు

రొటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేన్సర్ శిబిరం

తణుకు పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ వ్యాన్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలను ఎక్కువగా భాగస్వామ్యం అయ్యేలా చేయాలని క్లబ్ సభ్యులను కోరుతూ, వారి సేవలను అభినందించడం జరిగింది.

వార్త‌లు

బాత్రూంలో అనుమానాస్పద మృతి

పాలంగి గ్రామానికి చెందిన అమీరిశెట్టి దుర్గాప్రసాద్ (45) లారీ డ్రైవర్ గా పనిచేస్తూ దూరప్రాంతాలకు డ్యూటీకి వెళ్లి వస్తు ఉంటాడని ఈ నేపథ్యంలో ఇటీవల డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన అతను ఇంట్లోనే ఉండి తొమ్మిదవ తేదీ రాత్రి వరకు బంధువుల ఫోన్లకు కూడా స్పందించక పోవడం చేత అనుమానంతో బంధువులు అతను నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి చూడగా బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పొలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల నుండి ఫిర్యాదు

వార్త‌లు

మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన గంట గౌతమ్ కుమార్ కలుపు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే గంట గౌతమ్ కుమార్ 2018లో తేతలి గోగులమ్మపేట ప్రాంతానికి చెందిన దుర్గా కళ్యాణి అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకుని చివటం గ్రామంలో కాపురం ఉంటున్నాడు. అతను సిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో కాంపౌండర్ గా, భార్య జిఎన్ఎమ్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారికి 2021 లో ఒక కుమార్తె

వార్త‌లు

మహిళ అద్రుశ్యం – మిస్సింగ్ కేసు నమోదు

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన గన్నవరపు నందిని (27) అక్టోబర్ నెల 6 తేదీ నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పిఎస్ఐ నవీన్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరవ తేదీ అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వారికి తెలియకుండా గోడదూకి పారిపోయినట్లు సమీప సి.సి. కెమెరా ఫుటేజ్ లో కనిపించినట్లు ఆయన తెలిపారు.

Scroll to Top