వార్త‌లు

తణుకు ఆర్టీసి డిపో ఉద్యొగుల రిలే నిరశనదీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు డిపోలో యాజమాన్యం కొత్తగా పెట్టిన పని భారం పెరిగిన రెస్ట్ ఆఫ్ డ్యూటీల యొక్క ఇన్కమింగ్ టైము కిలోమీటర్లు తగ్గించమని, డ్రైవర్ గారపాటి రామారావు అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, వెహికిల్ కండిషన్ ను మెరుగు పరచాలని, డిపోలోని మిగిలిన ఇతర సమస్యలపైన తణుకు డిపో నేషనల్ మజదూర్ అసోసియేషన్ 14 నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగినది.ఈ రిలే నిరాహారదీక్షలో మొదటిరోజు తణుకు డిపో డ్రైవర్ […]

వార్త‌లు

నరేంద్రమోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలి

ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈనెల 16న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన విజయవంతం చేయాలని తణుకు ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు నియోజవర్గ పరిశీలకులు ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో జరగనున్న ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. 2017లో ప్రధానిగా నరేంద్రమోదీ

వార్త‌లు

గతం మరిచారా మాజీ మంత్రిగారూ – ఏఎంసి చైర్మన్ కొండేటి శివ

మద్యం కుంభకోణానికి పాల్పడింది వైసీపీ నేతలు తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ విమర్శలు మద్యం కుంభకోణానికి పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులు కాదా అని తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నించారు. సోమవారం తణుకు ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ

వార్త‌లు

కల్తీ బ్రాండ్లను మార్కెట్ లోకి తెచ్చిందే జగన్ మోహన్ రెడ్డి – మంత్రి కందుల దుర్గేష్

మద్యం విషయంలో విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు తమ విధానం మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక నాడు కల్తీ మద్యానికి వైసీపీ నేతలు వత్తాసు పలికితే తాము ఉక్కుపాదం మోపుతున్నామన్న మంత్రి దుర్గేష్ నాడు కల్తీమద్యానికి ఆద్యులైన వారిని జగన్ మోహన్ రెడ్డి అందలం ఎక్కిస్తే తాము అలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని సస్పెండ్ చేస్తున్నామని వెల్లడి కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ ఎన్ ఫోర్స్

వార్త‌లు

నిడదవోలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు

”నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన” ”రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అని.నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలి అని నిడదవోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ జయరాజ్ సతీష్ కి వినతిపత్రం అందజేసిన నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు నిడదవోలు కొవ్వూరు పరిశాలికులు గిరజాల బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా

వార్త‌లు

జలజీవన్ మిషన్ పనులకు గతప్రభుత్వం కేటాయించిన నిధులు ఉన్నాయా? పక్కదారి పట్టాయా?

గ్రామంలో జలజీవన్ మిషన్ పనులకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉన్నాయా? పక్కదారి పట్టాయా? అనే అనుమానం వస్తుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు అన్నారు. తణుకు తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం బృందం తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక వర్మ కి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో పైపులైన్లు పునరుద్ధరణ చేసి రక్షిత మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి పరచి

వార్త‌లు

మద్యం పేరుతో పేదప్రజల రక్తం మాంసాలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం – మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

మద్యం పేరు చెప్పి పేద ప్రజల రక్తం మాంసాలను కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు, నకిలీ మద్యంపై పోరులో వైయస్సార్సిపి రాష్త్ర వ్యాప్త పిలుపులో భాగంగా సొమవారం తణుకులో వైసిపి శ్రేణులు భారీయెత్తున నిరసన చేపట్టాయి. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ కూటమి పాలనలో అడుగంటు పోయింది. తణుకు నియోజకవర్గంలో 156 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కారుమూరి. కూటమి

వార్త‌లు

కార్డియో – పల్మనరీ పునర్జీవం పై అవగాహన కార్యక్రమాలు

13 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు CPR ( కార్డియో- పల్మనరీ పునర్జీవం) పై నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డా.బి.దుర్గమహేశ్వరరావు CPR పై ప్రతిఙ్ఞ చేయించి, CPR చేయు విధానం గురించి, సిబ్బందికి, పౌరులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా ఎలక్ట్రిక్ షాక్, యాక్సిడెంట్, నీటిలో మునిగి పోవడం, మొదలగు వాటివల్ల వారి యొక్క గుండె కొట్టుకొనుట

వార్త‌లు

తణుకు పట్టణంలో ఎక్సైజ్ శాఖ సోదాలు – ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయి స్వాధీనం

తణుకు పట్టణంలో ఎక్సైజ్ సోదాలు; గంజాయి రవాణా దారులు అరెస్ట్తణుకు పట్టణంలో ఉండ్రాజవరం సెంటర్ నుండి పాలంగి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన సోదాలలో స్కూటీలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. పట్టుబడిన యువకులు స్థానిక పైడిపర్రు, మండపాక గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించడం

వార్త‌లు

పాపికొండల బోటు షికారు మరలా ప్రారంభం

గోదావరి వరదల తగ్గుముఖంతో తిరిగి ఆరంభమైన సందడి. అంధ్రప్రదేశ్ రాష్త్రంలో ప్రసిద్ధి చెందిన పాపికొండల బోటు షికారు మూడు నెలల విరామం తరువాత శనివారం ప్రారంభమైంది. ప్రతీయేటా వచ్చే గోదావరి వరదల కారణంగా జూలైలో బోటు షికారుని ప్రభుత్వం నిలిపివేసింది. వరదలు తగ్గడంతో తిరిగి ఆరంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలో గండిపోచమ్మ గుడి వద్ద నుంచి శనివారం ఒక బోటులో 23 మంది ప్రయాణించారు. తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడి వద్ద నుంచి సుమారుగా 15 బోట్లు

Scroll to Top