మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జయంతి
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం భారత దేశ ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ నిరంతర బోధకుడు, సాధకుడు పేపర్ బాయ్ నుండి మిస్సైల్ మేన్ వరకు ఎదిగిన ఎవరెస్టు శిఖరం అబ్దుల్ కలాం అని అన్నారు. జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండారు వాయునందన రావు మాట్లాడుతూ శాఖాహారి ఆజన్మ […]










