వార్త‌లు

కారుమూరీ… డైవర్షన్ పాలిటిక్స్ మానుకో

నాగ హారిక హత్య కేసును డైవర్షన్ చేయడానికి ప్రయత్నం లేహం ఫుడ్స్ పై ఉద్యమం చేస్తానంటూ ముసలి కన్నీరు నాగ హారిక కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి అప్పటి పోలీసులపై కారుమూరి ఒత్తిడితోనే నీరుగారిన కేసు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హితవు పలికారు. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన నాగ హారిక కేసు విషయంలో […]

వార్త‌లు

శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే కార్తీక మాసం పురస్కరించుకుని పెనుమంట్ర మండలంలో వేంచేసిన నత్తా రామేశ్వరం, జుత్తిగ గ్రామాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసితో పాటు కుమారుడు నిఖిల్ రత్న కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

మంత్రి దుర్గేష్ చొరవతో రోడ్లకు మరమ్మత్తులు

వార్షిక నిర్వహణ నిధి క్రింద గోపవరం నుండి డి.ముప్పవరం, డి. ముప్పవరం నుండి కానూరు వరకు జరుగుతున్న పనులు స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు నిడదవోలు: మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు నియోజకవర్గంలో రహదారి మరమ్మత్తుల పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ చొరవతో వార్షిక నిర్వహణ నిధి (ఏఎంజీ) క్రింద నిడదవోలు నియోజకవర్గంలోని గోపవరం నుండి

వార్త‌లు

గ్రంథాలయ ఉద్యమకారులకు ఘనంగా నివాళులు

తణుకు, నవంబర్ 16, 2025 : గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామ, పట్టణ, నగరాల్లో వ్యాప్తి చేసిన మహానుభావులైన అయ్యంకి వెంకట రమణయ్య, డా.ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం,వెలగా వెంకటప్పయ్య చిరస్మరణీయులని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రోత్సహించిన వారి గురించి

వార్త‌లు

ముమ్మాటికి ఇది రాజకీయ హత్య..!

హారిక హత్య కేసులో వైసీపీ నేతల పాత్ర కేసు పక్కదోవ పట్టించేందుకు రూ. 50 లక్షలు డీల్ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన మాజీ మంత్రి కారుమూరి తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన ముళ్ళపూడి నాగాహారిక కేసులో అప్పటి వైసీపీ నేతలు హస్తం ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ముమ్మాటికి ఇది రాజకీయ హత్య అని పేర్కొన్నారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఆ పార్టీ

వార్త‌లు

ప్రతి ఎంవోయూ గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు

:- మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిందనడానికి సాక్ష్యమే సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఎంవోయూలు విశాఖ సీఐఐ సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన అధికార యంత్రాంగాన్ని, నాయకులను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నిత్య కృషీవలుడు అన్న మంత్రి దుర్గేష్.. సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టిన వ్యక్తి యువనేత లోకేష్ అని వెల్లడి విశాఖపట్నం: విశాఖలో జరిగిన రెండు రోజుల సిఐఐ సమ్మిట్ లో దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు

వార్త‌లు

పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ

• 30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి 16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖపట్నం: సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల

వార్త‌లు

తణుకు అభివృద్ధికి మార్గదర్శకులు వైటీ రాజా

తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దివంగత వైటి రాజా మార్గదర్శకత్వం చూపించారని రెరా సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి పురస్కరించుకొని స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు సంతాప సభ నిర్వహించారు. తొలుత వైటి రాజా చిత్రపటానికి పూలమాల వేసిన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ

వార్త‌లు

ఉండ్రాజవరం జడ్. పి. హైస్కూల్లో వరల్డ్ డయాబెటిస్ డే అవగాహన సదస్సు

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు కు, పిల్లలకు, డయాబెటిస్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం పి.హెచ్. సి. ప్రధాన వైద్యాధికారి డా. దుర్గా మహేశ్వర రావు మాట్లాడుతూ డయాబెటిస్ వ్యాధినే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి అని కూడా అంటారని తెలిపారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండుటనే డయాబెటిస్ అంటారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోవను. దీనివల్ల

Scroll to Top