వార్త‌లు

విబిజి జి రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలి – బళ్ళ చిన వీరభద్రరావు

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన జి రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ముందు పూలు పెట్టి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ […]

వార్త‌లు

పర్యాటక హబ్‌గా అనకాపల్లిని తీర్చిదిద్దుతాం

:- మంత్రి కందుల దుర్గేష్ ముత్యాలమ్మపాలెం తీరంలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఉత్తరాంధ్ర సంస్కృతికి అనకాపల్లి ఉత్సవ్ వేడుకలు అద్దం పడుతున్నాయని వెల్లడి అనకాపల్లి: విశాఖ ఉత్సవ్ లో భాగంగా అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం తీరంలో నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ నిజమైన ప్రజా ఉత్సవంగా సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఎంపీ సీఎం

వార్త‌లు

ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటాం మహాత్మా గాంధీ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచన విరమించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఇరగవరం మండలం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి అన్నారు .గురువారంనాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎర్రాయి చెరువు, పొదలాడ, రేలంగి, కొత్తపాడు, ఇరగవరం తూర్పు విప్పరు గ్రామలలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపును అనుసరించి ఉపాధి హామీ కార్మికుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహలు వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ

వార్త‌లు

మహాత్మాగాంధీ వర్థంతి – ఎమ్మెల్యే రాధాకృష్ణ నివాళులు

మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమాన్ని శుక్రవారం తణుకులో కూటమి నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు రాష్ట్రపతిరోడ్డు కోర్టు ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంగ్లేయుల ప్రభుత్వ విధానాలను తుద ముట్టించి దేశ ప్రజలకు స్వేచ్ఛ, సౌబ్రాతృత్వాన్ని పంచి జాతిపితగా ఆయ్యారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన చూపించిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

కల్తీ నెయ్యి పేరుతో రూ. 250 కోట్లు దోపిడీ

వైసీపీ నాయకుల ముఠా గుట్టు రట్టు చేసిన సిట్‌ ‘సిట్‌’ రిపోర్టులో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు వైసీపీ హడావుడి రసాయనాలతో లడ్డూ తయారు చేశారని సిట్‌ నిర్థారణ కారుమూరికి వెంకన్న గుడి మెట్లు ఎక్కే అర్హత లేదు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజం పసుపు నీళ్లతో ఆలయం శుద్ధి చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తిరుమల వెంకన్న లడ్డూను అపవిత్రం చేసేలా కల్తీ నెయ్యి తయారు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు రూ. 250 కోట్లు దోపిడీ చేశారని తణుకు

వార్త‌లు

లౌకికవాదానికి ప్రతీక గాంధీజీ – డి.వి.వి.యస్ వర్మ

జాతీయోద్యమంలో “ లౌకికవాదం “ అన్న పదాన్ని ప్రవేశ పెట్టింది గాంధీజీయేనని ప్రజా రిపబ్లిక్ ఉద్యమం కన్వీనర్  డి. వి. వి. యస్. వర్మ  స్పష్టం చేశారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా స్థానిక బ్యాంక్ కాలనీలోని స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ లోని గాంధీజీ విగ్రహం దగ్గర జరిగిన నివాళి సభలో ఆయన పై వ్యాఖ్యను చేశారు. డి. వి. వి. యస్. వర్మ మాట్లాడుతూ 1928 లో  జాతీయ రాజ్యాంగ సూత్రాలపై మోతీలాల్ నెహ్రూ రిపోర్టులోనూ ,1931 కరాచీ సభ ఆమోదించిన తీర్మానంలోనూ

వార్త‌లు

ఏపీ తూర్పుతీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పం: మంత్రి కందుల దుర్గేష్

అట్టహాసంగా ప్రారంభమైన ‘అరకు ఉత్సవ్-2026’. పాల్గొన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అరకు ఉత్సవ్ లో కళాకారులను ఘనంగా సన్మానించిన మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటుకు శంకుస్థాపన రూ. 29.88 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి బొర్రా గుహల అభివృద్ధి, అరకులో రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ ఆధునీకరణ చేస్తున్నామని వెల్లడి ప్రతి ఇంట్లో

వార్త‌లు

ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే వేదికగా “అరకు ఉత్సవ్–2026”

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో “అరకు ఉత్సవ్–2026″ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారితో కలిసి వైభవంగా ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ఉత్సవం మన గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, మారేడుమిల్లిలో గిరిజన హోమ్‌స్టేల అభివృద్ధి వంటి కీలక పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. స్థానిక కళాకారులను

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఈ గవర్నెన్స్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

ఉండ్రాజవరం : ఈ గవర్నెన్స్ – గుడ్ గవర్నెన్స్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం,  గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయం లో గ్రేడ్1 నుండి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ వారి ఇంటి వద్దనే అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో అవసరమైన వివిధ  కార్యక్రమాల

వార్త‌లు

పంచాయతీ  అభివృద్ధి అధికారులకు ఈ-గవర్నన్స్ శిక్షణ

 ఇరగవరం  మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో  గురువారం ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి  ఈ-గవర్నన్స్  పై  క్లస్టర్ స్థాయిలో అత్తిలి, పెనుమంట్ర మరియు ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణా కార్యక్రమము జరిగింది.ఈ శిక్షణా కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి  ఎ.శ్రీనివాసు మాట్లాడుతూ ఆర్.జి.ఎస్.ఏ కార్యాచరణ ప్రణాళికలు 2025-26 సంబంధించి  ఈ-గవర్నన్స్  పై పంచాయతీలు సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని మెరుగుపరచబడటానికి వ్యూహాలు సాంకేతికతలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.  సదరు శిక్షణా కార్యక్రమములో డిప్యూటీ ఎం‌పి‌డి‌ఓ(పి‌ఆర్) పి.వి.ఎన్.నరసింహమూర్తి, డిప్యూటీ ఎం‌పి‌డి‌ఓ

Scroll to Top