వార్త‌లు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ఘనవిజయం.

24 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన నవీన్‌యాదవ్‌. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల సంఘం. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు. మిఠాయిలు తినిపించుకుని మంత్రులు, ముఖ్య నేతల శుభాకాంక్షలు.

వార్త‌లు

14 సంవత్సరాలలోపు పిల్లలు అందరు చదువుకోవాలి

తణుకు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు ఆదేశముల మేరకు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K కృష్ణ వేణి గారు పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మరియు బాధ్యతలు గురించి 14 సంవత్సర ల లోపు పిల్లలు అందరు చదువుకోవాలని, పనులు వెళ్లకూడదని, అలాగే బాల్య వివాహలు కు దూరంగా ఉండాలని, 18

వార్త‌లు

బిహార్లో బిజేపి హవా – ఏ.పి. అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక

బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి రాజకీయాలకు, పారదర్శక పరిపాలనకు, దేశాన్ని ముందుకు నడిపించే సమర్థ నాయకత్వానికి తమ పూర్తి మద్దతు తెలియజేసారు.నరేంద్ర మోదీ నేతృత్వంపై అచంచల విశ్వాసంతో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపింది. ఈ విజయం భారతీయ జనతా పార్టీ చేపట్టిన అభివృద్ధి ఆజెండాకు, దేశాన్ని వికసిత భారతం వైపు నడిపించే మోదీ దూరదృష్టి నాయకత్వానికి ప్రజల నుండి వచ్చిన భారీ ఆమోదం. బీహార్ ప్రజలకు, నూతన ప్రభుత్వానికి

వార్త‌లు

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ

విశాఖపట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడిందని ఈ సందర్భంగా రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. 38 మెగా పరిశ్రమల్నీ సీఎం ప్రారంభిండం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఒక్క ఎంఎస్‌ఎంఈల ద్వారానే 5 లక్షల మంది

వార్త‌లు

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ లో టూరిజం స్టాల్ ను సందర్శించి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం :విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు.సీఐఐ సదస్సు ద్వారా విశాఖ, అమరావతి, తిరుపతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు రానున్నాయని, పర్యాటక రంగంలో దాదాపు 100

వార్త‌లు

పురుషుల శాఖ గ్రంధాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు

తణుకు బ్యాంక్ కాలనీ నందు ఉన్న పురుషుల శాఖ గ్రంధాలయం నందు జాతీయ గ్రంథాలయాల వారోత్సవములు ప్రారంభోత్సవం జరిగినదిప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం జండా ఆవిష్కరణ చేయగావావిలాల సరళదేవి గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ ను అందరితో చేయించారు అనంతరం సభా కార్యక్రమాల ప్రారంభమయ్యాయి.సరళ దేవి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సభకు తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి

వార్త‌లు

వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం

వివేకానంద గ్లోబల్ హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొనగా 22 మంది విజేతలకు మానవతా జిల్లా కమిటీ వారిచే స్పాన్సర్ చేయబడిన ప్రోత్సాహక బహుమతులను ఎస్ కే ఎస్ డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ఆల్రౌండర్ గా గెలుపొందిన జి. రంజిత్

వార్త‌లు

బీటెక్ విద్యార్థి హత్యకేసులో సూత్రధారి కారుమూరి

కారుమూరి ఒత్తిడితోనే కేసు పక్కదోవ పట్టించారు వైసీపీ నేత ముళ్ళపూడి రూప నిందితురాలు కావడంతోనే నాగ హారిక హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం హత్యకు గురైన బీటెక్ విద్యార్థి ముళ్ళపూడి నాగ హారిక కేసును అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీసులపై చేసిన ఒత్తిడి కారణంగానే పక్కదోవ పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రాజకీయ

వార్త‌లు

నాగహారికను చంపేశారని చెప్పినా పొలీసులు వినలేదు

అనుమానాస్పద మృతిగా నమోదు చేసి వదిలేశారు దీని వెనుక మాజీ మంత్రి కారుమూరి హస్తం ఉంది మృతురాలు నాగహారిక అమ్మమ్మ పార్వతి తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముళ్ళపూడి నాగహారిక హత్య చేశారని ఎంత మొత్తుకున్నా అప్పట్లో పోలీసులు కనీసం పట్టించుకోలేదని మృతురాలి అమ్మమ్మ గజ్జరపు పార్వతి అన్నారు. కేవలం అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఒత్తిడితోనే పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గురువారం తణుకులో ఎమ్మెల్యే

Scroll to Top