తుఫాను ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి బాధితులకు నిత్యావసరాలను అందజేసిన ఎమ్మెల్యే ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ప్రభావాన్ని అధికారులు, కూటమి నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు అత్తిలి మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుఫాను బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 1250 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం […]









