వార్త‌లు

గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ

ఇల్లు లేని నిరుపేదల కలలు సాకారం చేసేందుకు కూటమి కృషి తేతలిలో గృహప్రవేశాలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాలు పేరుతో దోపిడీకు పాల్పడ్డారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. బుధవారం తణుకు మండలం తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గృహప్రవేశం చేసి మాట్లాడారు. 2024 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇళ్ళు నిర్మాణానికి […]

వార్త‌లు

పిపిపి విధానం తోనే అదనంగా 220 మెడికల్ సీట్లు

కూటమి హయాంలోనే పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఇప్పుడు ముసలి కన్నీరు కార్చుతున్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిపిపి విధానంతో మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 220 మెడికల్ సీట్లు కేటాయించడం జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. మంగళవారం

వార్త‌లు

రసాయనఎరువుల వినియోగంపై ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితి అవగాహన

రసాయన ఎరువుల వివేకవంతమైన వినియోగంపై ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితి కార్యాచరణ మార్గదర్శకాలు:❗రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్నట్లు గమనించబడింది. ఎరువులను వివేకవంతంగా ఉపయోగించడం గురించి రైతులలో అవగాహన లేకపోవడం ఒక కారణం. సమర్థవంతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, రసాయన ఎరువులను ముఖ్యంగా పరిశ్రమలకు మరియు అంతర్జాతీయ సరిహద్దుకు అక్రమంగా మళ్లించే సమస్యపై గ్రాస్ రూట్స్ స్థాయిలో నిఘా మరియు చర్యలు అవసరం. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, సమగ్ర బహుళస్థాయి యంత్రాంగం ప్రతిపాదించబడింది. గ్రామం,

వార్త‌లు

యస్.కె.యస్.డి. మహిళా కళాశాల ఆధ్వర్యంలో గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకశిబిరం

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ జె. కిషోర్ మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ విభాగమువారు ఈ స్పెషల్ క్యాంప్ నిర్వహించడానికి తమ పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లని అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ మాట్లాడుతూ వాలంటీర్లు అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకతను గ్రామ

వార్త‌లు

రైతుల గురించి మాట్లాడే అర్హత కారుమూరికి లేదు

తుఫాను సమయంలో రైతులు, బాధితులకు అండగా కూటమి నిలబడింది ఐదేళ్ల వైసిపి పాలనలో రైతులను అవహేళన చేసింది కారుమూరి నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 3.45 కోట్లు పరిహారం మంజూరు మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు లేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. మొంథా తుఫాను సమయంలో హైదరాబాదులో ఉన్న కారుమూరి తుఫాను అంతా చక్కబడిన

వార్త‌లు

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు

మెట్రోస్టేషన్ సమీపంలోని గేట్-1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి. ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వార్త‌లు

ఢిల్లీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి

అమరావతి: ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని,అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

వార్త‌లు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి

తణుకు మండలంలో కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ శివ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ కోరారు. సోమవారం తణుకు మండలం కోనాల, దువ్వ గ్రామాల్లో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం మిల్లుకు చేరిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం

వార్త‌లు

నిరంతర స్ఫూర్తి మంత్రం వందేమాతరం గీతం

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ దేశ స్వాతంత్ర్య సాధన సంకల్పానికి బలమైన ఊపిరులూదిన గీతాన్ని రాసిన బంకించంద్ర చటర్జీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్ విజయవాడ: భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

వార్త‌లు

చిరంజీవ చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది

ఓటీటిలో దుమ్ము రేపుతుంది హీరో రాజ్ తరుణ్ విశాఖపట్నం: నవంబర్ 10 (కోస్టల్ న్యూస్) లవర్ బాయ్ రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో విజయయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో

Scroll to Top