రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి దర్శించుకున్న తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు. రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


