జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలంలో ప్రతి గ్రామంలో గల పోలింగ్ స్టేషన్లో వద్ద బూత్ లెవెల్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారని తహసిల్దార్ పి.ఎం. డి. ప్రసాద్ తెలియజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉండ్రాజవరం హైస్కూల్లో సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించి ఓటు యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యత హక్కులు తహసిల్దార్ ప్రసాద్ వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఓటరు దినోత్సవం పై పోటీలను నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల పరిషత్ పరిపాలనాధికారి వి. వి. వి. ఎస్. రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయ శర్మ, మండల విద్యాధికారి సి. హెచ్. సక్సేనారాజు, ఏ.ఎస్.ఓ, వీఆర్వో వెలిచేటి పాపారావు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు బిఎల్వోలు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


