ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఔత్సాహిక గాయకుల కొరకు సినీ సంగీత సాహిత్య అభిమానుల కొరకు ప్రతియేటా సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తనకు తణుకు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆడిటోరియంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో ఉభయ రాష్ట్రంలో నుండి గాయనీ గాయకులు విచ్చేసి తమ తమ పాటలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. తణుకు ప్రాంతంలో మొట్టమొదటి ఆర్కెస్ట్రా స్థాపించి సుదీర్ఘ ప్రయాణంలో వందలాది కార్యక్రమాలు నిర్వహించి సినీ సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ గాయకుడు మల్లెల ప్రసాదరావు స్మారక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత రసరాజు మాట్లాడుతూ సినీ గేయాలపనలో ఘంటసాల బాలసుబ్రమణ్యం వంటి గాయకులు మరలా పుట్టరని, బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమానికి హాజరై మూడు గంటల సేపు ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలు మరువలేనని అన్నారు. అదేవిధంగా ఇటువంటి సినీ సంగీత కార్యక్రమాల నిర్వహణ వ్యయంతోను ఓపికతోను చేయాలని, ఈ విషయంలో ఎంతో ఓర్పుతో తణుకు ప్రాంతంలో కచేరీలు నిర్వహిస్తూ ఔత్సాహిక గాయకులను ప్రోత్సహిస్తున్న ప్రముఖ గాయకుడు రాజు కృషి అభినందనీయమని అన్నారు. అదేవిధంగా తన తండ్రి స్మారకంగా విజయ్ ఆర్కెస్ట్రా అధినేత విజయ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాటల పోటీల విజేతల ప్రధమ విజేతగా వైజాగ్ వాస్తవ్యురాలు పి. సుజాత ఆలపించిన (నాదం నీ దీవెనై) అనే గీతానికి మొదటి బహుమతి పొందగా, ఎలక్ట్రికల్ ఏ. ఈ. తణుకు ప్రాంతానికి చెందిన పి.యు.బి. శ్రీధర్ (ఆ కనులలో) అనే గీతాన్ని ఆలపించి రెండవ స్థానం, విజయవాడ నుండి వచ్చిన యం. మాధవి (వెన్నెల్లో గోదారి) అనే పాటతో తృతీయ బహుమతి, వాడపల్లి నుండి వచ్చిన ఎం. ప్రియాంక (మీరజాల గలడా) అనే పాటతో నాలుగవ బహుమతి పొందారు. అదేవిధంగా కన్సలేషన్ బహుమతులు ఏలూరు కె ఎస్ జి రెడ్డి, నరసాపురం ఎస్కే షరీఫ్, ఏలూరు, జి. బాల, కంతేరు- ఋషి, అనకాపల్లి- కె.ఎం నాయుడు, అత్తిలి- జి.నరసింహ, మరియు మినీ కన్సోలేషన్ బహుమతులు బ్లెస్సింగ్ మోజెస్ చింతలపూడి ఎం సాయిబాబా అమలాపురం సిహెచ్ బాలకృష్ణ వేర్వాసరం హేమ మండపేట సుగుణ గుంటూరు ప్రకాష్ తాడేపల్లిగూడెం వాసులను సాలువాలతో సత్కరించి మేమంతాలను మెమొంటోలను ముఖ్య అతిధులు యాతం నాగరాజు, ఏ వి ఆర్ సిద్ధాంతి, రెడ్డి, భీమవరం, తాడేపల్లిగూడెం నుండి వచ్చిన ప్రముఖ గాయకులు అందించారు. ఈ పాటల కార్యక్రమానికి న్యాయ నిర్ణీతలుగా ఆకుమర్తి రాజు, జీవి రమణ రాజమండ్రి వ్యవహరించారు, ట్రాక్ సింగర్స్ ఎస్. దొరబాబు, ఎస్. శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఎంపీ ఆర్ మ్యూజిక్ ఆధ్వర్యంలో సౌండ్ సిస్టం నిర్వహించారు.


