భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా నాల్గవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి.సత్యవతి, జెండా వందన కార్యక్రమములో భాగంగా తణుకు న్యాయస్థాన భవన సముదాయములో సొమవారం జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అందరూ కులాలు, మతాలకు అతీతంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ, సమానత్వాలతో జీవించాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అందరూ చట్టాలకు లోబడి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణ సత్యలత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు పోతర్లంక సాయిరాం, పి.వి.ఎన్. రంజిత్ కుమార్, బెంచ్ మెజిస్ట్రేట్ లు టి.ఆంజనేయులు, జి.వి.వి.ఎస్. మూర్తి , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, బార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కలిదిండి పద్మావతి, సి.హెచ్. గోపికృష్ణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


