వార్త‌లు

కార్పొరేట్ విద్యాసంస్థల పిచ్చలవిడి ఫీజుల దోపిడీ అరికట్టాలి

ప్రైయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల పిచ్చలవిడి ఫీజుల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని విద్యా వ్యాపారాన్ని నియంత్రించి , ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ.ఐ.యస్.ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తణుకులో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసా కళాశాల జనరల్ బాడీ సమావేశం ఎం.ఆకాశ్ అధ్యక్షతన జరిగింది. ఫీజుల నియంత్రణ , విద్యా వ్యాపారంపై రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. […]

వార్త‌లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తీసుకు వస్తున్న వి. బి.జి. రాం. జి పథకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు, సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా శనివారం మండలంలో ఏలేటిపాడు, రాపాక, కాకుల ఇల్లిందలపర్రు గ్రామలలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, మునిస్వామి మాట్లాడుతూ అనేక

వార్త‌లు

ఎస్.కె.ఎన్.డి మహిళా కళాశాలలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం”

స్థానిక ఎస్.కె.ఎన్.డి మహిళా కళాశాలలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం” పురస్కరించుకొని మరియు యోగాంధ్ర లో భాగంగా యోగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కట్టుంగ రామచక్రధరరావు యోగాసన స్టోర్ట్స్ అసోసియేషన్, పశ్చిమ గోదావరి విచ్చేసి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక, వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు మరియు ఆత్మలను అనుసంధానించే ఒక ప్రాచీన జీవన విధానమని, ప్రతీరోజు యోగా

వార్త‌లు

తణుకు నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు తణుకు నియోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ పాలంగి స్పందన మానసిక వికలాంగుల ఆశ్రమం నందు కేక్ కట్ చేసి స్సీట్స్ బిస్కెట్ లు చాక్లెట్ లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భావి భాతప్రదాని రాహుల్ గాంధీ ని ప్రజలు కోరుకుంటున్నారని, ఇప్పుడున్న దేశపరిస్థితిలో కుల మతాలకు ప్రజలందరిని ఏకతాటిపై నడపగలిగే సమర్ద

వార్త‌లు

బహిరంగ మద్యపానం చేస్తే చర్యలు తప్పవు – తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి

తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో  బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన  చర్యలు ఉంటాయని మరియు మద్యం షాపులకు సంబంధించిన పర్మిట్ రూమ్ లో మరియు బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, అలాకాకుండా బహిరంగ ప్రాంతాల్లో, రహదారుల పక్కన  బహిరంగంగా మద్యం సేవిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న 4 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తణుకు స్టేషన్ పరిధిలో గల అనధికారిక మద్యం విక్రయాలపై కేసుల

వార్త‌లు

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది – ఎంపిడిఓ ఎ.శ్రీనివాస్

ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం నందు తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన పంచాయతీ అభివృద్ధి అధికారులకు, డిజిటల్ అసిస్టెంట్ లకు ఆర్.జి.ఎస్.ఏ. 2026-27 టి.ఎన్.ఏ. ఆధారిత ఆర్.జి.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ తయారీ పై ఒక రోజు ఓరియంటేషన్ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సదరు శిక్షణా కార్యక్రమములో కోర్స్ డైరెక్టర్ & మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్  ఆర్.జి.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ

వార్త‌లు

మాజీ మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

హోం మంత్రి అనితకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజం రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తీవ్రస్థాయంలో ధ్వజమెత్తారు. పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయేషాఖాన్‌ మాట్లాడుతూ మహిళలను కించపర్చుతూ మంత్రి అనితను ఉద్దేశించిన అమర్నాథ్‌ చేసిన

వార్త‌లు

టి.బి. నిర్ధారణకు అత్యాధునిక ఏ.ఐ. ఆధారిత ఎక్సరే పరీక్షలు

మంగళవారం పాలంగి గ్రామం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నందు ఏఐ ఆధారిత ఎక్స్ రే పరీక్షల ఉచిత వైద్య శిబిరం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.బి.దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో టీబి యూనిట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి నిర్వహించారు, టీబీ వ్యాధి పై జరిగిన అవగాహన సదస్సులో డా. దుర్గామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి టీ.బి. అభయాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం కోసం ప్రభుత్వం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, దీనిలో

వార్త‌లు

ఓటర్ల వివరాల సేకరణ ఫారాల పంపిణీ ప్రారంభం – తహసీల్దార్ ప్రసాద్

భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని 139వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు తహసీల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు

వార్త‌లు

కారుమూరి…. కారు కూతలు మానుకో

రాజకీయాల్లో చౌకబారు వ్యాఖ్యలు సరికాదు భవిష్యత్తుపై భయంతోనే కారుమూరి వ్యాఖ్యలు కులాలపై చిచ్చులు పెట్టిన మాజీ మంత్రి కారుమూరి కారుమూరిపై మండిపడిన తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డారు. సోమవారం తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. భవిష్యత్తుపై

Scroll to Top