పాపికొండలకు వెళ్తున్న బోటులో సాంకేతిక లోపం
పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్లిన పర్యాటక బోటు.. సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరిలో నిలిచిపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం ఉదయం ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. నదిలో దేవీపట్నం పాత పోలీసుస్టేషన్ ప్రాంతానికి వెళ్లే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు (డ్రైవర్) నిలిపి వేశాడు. సమాచారాన్ని కంట్రోల్ రూం అధికారులకు చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారు. బోటు పాయింట్ నుంచి వెంటనే […]









