వార్త‌లు

పాపికొండలకు వెళ్తున్న బోటులో సాంకేతిక లోపం

పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్లిన పర్యాటక బోటు.. సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరిలో నిలిచిపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం ఉదయం ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. నదిలో దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి వెళ్లే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు (డ్రైవర్‌) నిలిపి వేశాడు. సమాచారాన్ని కంట్రోల్‌ రూం అధికారులకు చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారు. బోటు పాయింట్‌ నుంచి వెంటనే […]

వార్త‌లు

రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు – మాజీ మంత్రి కారుమూరి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని

వార్త‌లు

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

గత సంవత్సరము అక్టోబర్ నెలలో తణుకు పట్టణములో ఉండ్రాజవరం రోడ్డులో గల స్మశానాల దగ్గర 5 కేజీల గంజాయినీ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి మండపాక గ్రామానికి చెందిన పోలవరపు కుమార శివ (21) అనే వ్యక్తి నీ తణుకు ఎక్సైజ్ అధికారులు బుధవారము అరెస్టు చేయడం జరిగింది. ఒరిస్సాలో మల్కాన్గిరి నుండి గంజాయిని కేజీ రెండువేల చొప్పున కొనుగోలు చేసి తణుకు పట్టణ పరిసరాలలో కేజీ 3000 కి టోకుగా

వార్త‌లు

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకులో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడం జరిగిన ఆ స్వామివారి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని బిజేపి శ్రేణులు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ

వార్త‌లు

స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

వార్త‌లు

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

ఉండ్రాజవరం: క్షయ రహిత సమాజమే ధ్యేయంగా దాతలు ముందుకొచ్చి, పలువురికి ప్రేరణ కల్పించాలని టీ.బీ. వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ అందించిన దాత, జర్నలిస్ట్ వెంకట సత్యసాయి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం, ఉండ్రాజవరం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో టీ.బీ. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ క్షయ రోగులందరూ

వార్త‌లు

పనిఒత్తిడి నుండి మమ్మల్ని కాపాడండి

ఉద్యోగుల ప్రాణాలు తీసుకుంటున్న పని ఒత్తిడి సంస్కృతిని వెంటనే అరికట్టి స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగులప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉండ్రాజవరం మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయం వీఆర్వో గా పని చేస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్ బాషా అధికారుల వేధింపులు తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన అత్యంత విషాదకర ఘటనను నిరసిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని

వార్త‌లు

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు… అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు

తణుకు నియోజకవర్గంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ ప్రత్యేక బ్యానర్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు, అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచారని

వార్త‌లు

ప్రజాసేవే పరమావధి – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఎండల్లో దాహార్తిని తీర్చడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మానవత నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో వేసవికాలాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ

వార్త‌లు

ఆహార పదార్థాలు కల్తీ పై అవగాహన

శశి జూనియర్ కళాశాల, తణుకు , గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K. కృష్ణ సత్యలత కాలేజీ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి చదువుకునే సమయం నుండే క్రమశిక్షణ కలిగి కస్టపడి చదువుకుంటే అనుకున్న పనులు సాధించవచ్చని, ప్రస్తుతం పిల్లలు చదువులో ముందుకు పోతున్నారని, అలాగే సమాజం లో జరిగే మోసాల

Scroll to Top