ఏపీ పర్యాటక రంగానికి ఏపీటీడీసీ వెన్నెముక
:- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ భవాని ద్వీపంలో ఘనంగా ఏపీటీడీసీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం విజయవాడలోని భవానీద్వీపంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. […]









