వార్త‌లు

జిల్లా అభివృద్ధిలో మాణిక్యాలరావు చెరగని ముద్ర

సామాన్యుడి నుంచి మంత్రిగా ఎదిగిన పైడికొండల విగ్రహం ఆవిష్కరణలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాజీ మంత్రి, దివంగత పైడికొండల మాణిక్యాలరావు జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు విగ్రహం ఆవిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సామాన్యుడు రాజకీయాల్లో రాణించిన విధానం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జిల్లాకు నిట్‌ తీసుకురావడానికి మాణిక్యాలరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తు […]

వార్త‌లు

నిడదవోలులో మార్కెట్ యార్డు, రైతు బజార్ త్వరలోనే వస్తాయి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలో మార్కెట్ యార్డు, రైతు బజార్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే అవసరమైన స్థలాన్ని నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ కేటాయించారని వెల్లడించారు. శనివారం నిడదవోలు పట్టణంలోని రంగా సుబ్బారావు–శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపం వద్ద జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార

వార్త‌లు

సమన్వయంతో తుపాను ప్రభావాన్ని అడ్డుకున్నాం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల మొంథా తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను

వార్త‌లు

ఘనంగా న్యూస్ నిఘా నేత్రం పత్రికను ఆవిష్కరించిన గంట్ల శ్రీనుబాబు

విశాఖపట్నం: నవంబర్ 1 (కోస్టల్ న్యూస్) ఉత్తరాంధ్రలో నూతనంగా వెలువడిన న్యూస్ నిఘానేత్రం పత్రిక తొలి సంచికను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా న్యూస్ నిఘా నేత్రం శీర్సికను ఘనంగా ప్రారంభించారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరడం వలన పలు సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమవుతుందని, ఒక సమస్యను ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కారం అయ్యే సమయం కన్నా వార్తా

వార్త‌లు

భవన నిర్మాణ కార్మికులు ఐక్యమత్యమే సమస్యలకు పరిష్కారం

భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) సమావేశం స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో య ర్రా మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఇటు వల మృతి చెందిన కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

వార్త‌లు

“ఇదే అసలైన టీమ్ స్పిరిట్ – సీఎం చంద్రబాబు”

రాష్ట్రస్థాయి గుర్తింపు – జిల్లా గర్వకారణం మొంథా తుఫాన్ ఫైటర్లకు అభినందనలు — మంత్రి కందుల దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌. మాధవరావుకు ప్రశంస పత్రాలు అమరావతిలో శనివారం జరిగిన మొంథా తుఫాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 137 మంది అధికారులకు మెమెంటోలు, ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా

వార్త‌లు

తుపాను బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి నిత్యావసరాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇటీవల మొంథా తుపాను కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకు చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతోపాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావం ఉంటుందుని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి

వార్త‌లు

ప్రైవేట్ ఆసుపత్రుల యందు డా. ఎన్టీఆర్ వైద్య సేవలు యధాతధం

గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించిన సమ్మె ప్రభుత్వం తో చర్చలు సఫలమవడంతో, శనివారం నుండి డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల యందు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా సమన్వయాధికారి పి. ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఉచిత వైద్య సేవలను యథావిధిగా పొందగలరనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 45 ప్రైవేట్ ఆసుపత్రులు

వార్త‌లు

జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పకడ్బందీగా నిర్వహణ

జిల్లాలో 2,35,031 మంది లబ్ధిదారులకు రూ.103.17 కోట్ల మేర పంపిణీకి ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెరిగిన రేటుతో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవు తుందని తెలియ చేశారు. వృద్ధాప్యులు, వితంతువులు, నేతకార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, దప్పు

వార్త‌లు

నిడదవోలు ఆర్వోబీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిడదవోలు పట్టణంలో రూ.184.74 కోట్లతో శరవేగంగా జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోబీ నిర్మాణ మ్యాప్ ను సునిశితంగా చూశారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడగగా 65 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం డ్రైన్

Scroll to Top