వార్త‌లు

వినాయక చవితి ఉత్సవ అన్నసంతర్పణలో ప్రొఫెసర్ డికే రెడ్డి సౌజన్య దంపతులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీ.కే రెడ్డి, మరియు ఆయన సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడింది సుమారు రెండు వేలమంది పైచిలుకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్య దాతలు ప్రొఫెసర్ డీకే రెడ్డి ఆయన సతీమణి సౌజన్యతో కలిసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముదునూరు కిరణ్ రాజు, స్థానిక […]

వార్త‌లు

గురువులే సమాజ ప్రగతి నిర్దేశకులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) సమాజ ప్రగతికి గురువులే మార్గ నిర్దేశకులని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఇక్కడ అల్లిపురంలో జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 85 మంది ఉపాధ్యాయులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గురు శిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు తాను కూడా నాలుగేళ్లు

వార్త‌లు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన దక్షణ ఎమ్మెల్యే శ్రీనివాస్

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) సీతంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేశారు. సదరు చెక్కులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన లబ్దిదారుల వివరాలు: 1)

వార్త‌లు

ఏసీబీకి చిక్కిన కసింకోట మండలం నరసింగబిల్లి వీఆర్వో

అనకాపల్లి జిల్లా: 20000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కసింకోట మండలం నరసింగబిల్లివీఆర్వో సూర్య సాయి కృష్ణ పృథ్వి *పాసుబుక్ చేస్తానని స్థానికుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో మ్యుటేషన్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన వీఆర్వో ఏసీబీ వలకు చిక్కాడు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జట్టపురెడ్డి తుని గ్రామానికి చెందిన రైతు ఊడి నాగేశ్వరరావు

వార్త‌లు

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయంప్రతిపత్తి కళాశాల పాలకొల్లులో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ముందుగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరంజరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.రాజరాజేశ్వరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని,ఉన్నత విలువలతో కూడిన,పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడైన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు.ప్రతి వ్యక్తి తాను

వార్త‌లు

కొండెక్కిన కొబ్బరికాయ ధర

పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో

వార్త‌లు

త్వరలో నరసాపురం – చెన్నై వందే భారత్ రైలు: కేంద్రమంత్రి

పశ్చిమ గోదావరి జిల్లా త్వరలో నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు: కేంద్ర మంత్రి నరసాపురం-చెన్నైల మధ్య వందే భారత్ రైలు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకొచ్చామని, తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతుందని వివరించారు.

వార్త‌లు

డర్హం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు

విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) డర్హం తెలుగు అసోసియేషన్, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ జిటిఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు29, 30 తేదీల్లో గణేష్ ఉత్సవ వేడుకలు ఓషావాసిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ భట్టర్ పురోహితులు ఆధ్వర్యంలో వినాయక ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే కెనడా ధోల్ కార్యక్రమం రెండు రోజులు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

వార్త‌లు

జన్యు హృద్రోగ రోగులకు సమర్ధ వంతంగా చికిత్స చేస్తున్న మెడికవర్

విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) మనదేశంలో జన్యు హృద్రోగ రోగుల సంఖ్య పెరుగుతోందని, దీన్ని సమర్ధ వంతంగా చికిత్స చేయడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మెడికవర్ ఆసుపత్రి హృద్రోగ సీనియర్ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి తెలిపారు. ముఖ్యంగా ఇది మేనరికపు వివాహాలు చేసుకునే దంపతులకు జన్మించే శిశువులకు పలు రకాల జన్యు లోపాల వల్ల హృద్రోగాలు వస్తున్నా యన్నారు. వీటిని చాలా ముందుగానే గుర్తించి అవసరమైన వారికి ఆధునిక శస్త్ర చికిత్సలు చేసి

వార్త‌లు

విజయవంతంగా బెంటాల్స్ శస్త్ర చికిత్స

యశోద హాస్పిటల్స్ అరుదైన విజయం విశాఖపట్నం: సెప్టెంబర్ 3 (కోస్టల్ న్యూస్) హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతం అయ్యారు. మేఫెయిర్స్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోర్టిక్ రూట్, అసెండింగ్ అయోర్టిక్ అనూరిజం తీవ్రమైన అయోర్టిక్ సంబంధ రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న 28 ఏళ్ల పేషేంట్ ఉరిటి అనిల్ కుమార్‌కు బెంటాల్స్ శస్త్రచికిత్సను నిర్వహించారు.రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించగా

Scroll to Top