మొంథా తుఫాన్ ధాటికి అత్తిలి మండలంలో దెబ్బతిన్న పంటచేలను వ్యవసాయ శాఖ, మండల అధికారులు బుధవాం మండలంలో క్షేత్ర స్టాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అత్తిలి మండలంలోని పాలి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, తిరుపతిపురం గ్రామాల్లో తుఫాను వల్ల దెబ్బతిన వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు రాత్రి వేసిన గాలికి వరగడం జరిగింది ప్రస్తుతం రైతులు ఒరిగిన దబ్బులను పైకి లేపి కట్టుకోవడం పొడ తెగులు ఆశించకుండా హెక్సా కొనజోల్ లేదా ప్రొఫి కొనజోల్ మందును పిచికారి చేసుకోవాలని, ఎక్కడైనా నీరు నిలిచినట్లయితే నీరు బయటకు పోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.వి. రమేష్, తహశీల్దార్ సుబ్రహ్మణ్యేశ్వరరరావు, వ్యవసాయ అధికారి రాజేష్, డి.సి. చైర్మన్ నల్లూరి సురేష్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, ఆల్తి అజయ్, గ్రామ కూటమి నాయకులు రైతులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.


