పాపికొండల బోటు షికారు మరలా ప్రారంభం
గోదావరి వరదల తగ్గుముఖంతో తిరిగి ఆరంభమైన సందడి. అంధ్రప్రదేశ్ రాష్త్రంలో ప్రసిద్ధి చెందిన పాపికొండల బోటు షికారు మూడు నెలల విరామం తరువాత శనివారం ప్రారంభమైంది. ప్రతీయేటా వచ్చే గోదావరి వరదల కారణంగా జూలైలో బోటు షికారుని ప్రభుత్వం నిలిపివేసింది. వరదలు తగ్గడంతో తిరిగి ఆరంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలో గండిపోచమ్మ గుడి వద్ద నుంచి శనివారం ఒక బోటులో 23 మంది ప్రయాణించారు. తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడి వద్ద నుంచి సుమారుగా 15 బోట్లు […]










