వార్త‌లు

ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎస్ ఆర్ టి సి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తులసి రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకు డిపోలోని కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీలోకాంట్రాక్టు కార్మికులు సుమారు 25వేల మంది పనిచేస్తున్నారని వారికి లేబర్ […]

వార్త‌లు

మంత్రి నిమ్మల కుమార్తె వివాహ వేడుకలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

సీఎం చంద్రబాబుతో కలిసి నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహవేడుకలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం వారితో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర

వార్త‌లు

తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ జన్మదిన వేడుకలు

పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి శివ జన్మదిన వేడుకలు బుధవారం తణుకులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండేటి శివను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేకు కట్ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో

వార్త‌లు

కంతేరు గ్రామములో స్వస్త్ నారీ  స్వశక్తి పరివార్

ఇరగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కంతేరు గ్రామము నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశ పెట్టిన స్వస్త్ నారీ  స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కంతేరు సర్పంచ్ గుడిమెట్ల ఆదిలక్ష్మి, ఎంపీటీసీ గుడిమెట్లవీర్రెడ్డి, గ్రామనాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో గర్భిణీలకు  వైద్యసేవలు అందించుటకు ప్రసూతి వైద్య నిపుణులు, కంటిపరీక్షలు, కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు, వృద్దులకు ఆరోగ్యపరీక్షలు, క్షయ వ్యాది నిర్ధారణ పరీక్షలు చేసారు.  సాదారణ అనారోగ్యరోగులను పరీక్షించి

వార్త‌లు

టి.బి.రహిత గ్రామాల కొరకు కృషి చేయాలి

ఉండ్రాజవరం గ్రామంలో స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.ఉషాదేవి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి పోషకాహారం తీసుకోవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధుమేహం, బరువు తక్కువగా ఉన్నవారు 60 సంవత్సరాల పైబడిన వారు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు టీబీ పరీక్షలు

వార్త‌లు

ఈ పండుగ ఆనందాల్ని పెంచుతూ కేంద్రం జీఎస్టీ స్లాబ్ లను తగ్గించడం శుభపరిణామం

ఈ పండుగ ఆనందాల్ని మరింత పెంచుతూ కేంద్రం జీఎస్టీ స్లాబ్ లను తగ్గించడం శుభపరిణామని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక అన్నారు. మంగళవారం తణుకు-పైడిపర్రు బాల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉత్సవకమిటీ సభ్యులు ఇండుగపల్లి బలరామకృష్ణ (మాజీ కౌన్సిలర్), కురసాల శ్రీనివాస్ (దేవస్థానం కమిటీ చైర్మన్), చినిమిల్లి సాంబశివరావు, మెండు సుబ్బారావు, కొమ్ముల సోమేశ్వరరావు, పేరుకుల రమేష్ , పంగం సుబ్రమణ్యం ఆహ్వానం మేరకు మండపమునకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న ముళ్ళపూడి రేణుక ఉత్సవకమిటి భవాని

వార్త‌లు

అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలంలోని లక్ష్మీనారాయణ పురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి నాగేశ్వరావు సహాయ వ్యవసాయ సంచాలకులు మాటేరు డివిజన్ ఎం వి రమేష్, అత్తిలి మండలం వ్యవసాయాధికారి రాజేష్ పాల్గొన్నారుఈ కార్యక్రమంలో మార్టేరు సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ రైతులు అవసరమైనంత మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని అతిగా యూరియా వినియోగించినట్లయితే చీడ పీడల బెడద పెరుగుతుందని దానివల్ల పురుగుమందుల ఖర్చు పెరిగి తద్వారా రైతుకు వచ్చే

వార్త‌లు

గాయత్రి దేవి అలంకారంలో ఉండ్రాజవరం ముత్యాలమ్మ తల్లి

ఆశ్వీయుజమాసం శరన్నవరాత్రి మహోత్సవముల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దసరా మహోత్సవములలో భాగంగా రెండవ రోజు శ్రీ గాయత్రి అలంకారంలో ముత్యాలమ్మ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భారీ ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దసరా పురస్కరించుకొని ప్రత్యేక పూజలతో పాటు లలితా పారాయణ, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ పాలకవర్గం తెలియజేశారు

వార్త‌లు

భవన నిర్మాణ సంక్షేమ బోర్డు బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలి

పెండింగ్ లో ఉన్న కార్మికుల క్లెయిమ్స్ పరిష్కరించాలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ లక్షలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సంక్షేమ బోర్డులో నిధులను సైతం

వార్త‌లు

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ఐటీ ప్రొఫెషనల్‌ ఆరిమిల్లి కృష్ణ తులసి తణుకులో మహిళా సాధికారతపై అవగాహనమహిళా సాధికారత కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని ఆత్మవిశ్వాసంతోపాటు నిర్ణయాధికారం పొందడమని సింగపూర్‌ ఐటీ ప్రొఫెషనల్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కెరీర్‌ గైడెన్స్‌ కమిటీ, మానవత సంయుక్త ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత అనే అంశంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా

Scroll to Top