వార్త‌లు

ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం

‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల […]

వార్త‌లు

తణుకులో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం

రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 25 వ వార్డులో వున్న అంగన్వాడీ కేంద్రం లో పిల్లల తల్లితండ్రులకు అవగాహన సదస్సు నిర్వహిస్తూ శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇలా స్వేచ్ఛగా, కులాలకు, మతలకు అతీతంగా ఉండాలన్నదే రాజ్యాంగ ఉద్దేశమని, మహిళలు కట్నానికి వ్యతిరేకంగా పనిచేయాలని కట్నం ఇవ్వటం, తీసుకొనుట నేరమని, ఎంతో మంది కట్న దాహానికి బలై పోతున్నారని, చట్టం మహిళలకు అనుకూలంగా ఉందని సమస్య

వార్త‌లు

ఉండ్రాజవరం షష్టి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలోని వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు దేవస్థాన అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆయన నియోజకవర్గంలో దేవాలయాల

వార్త‌లు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలి

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ నియోజకవర్గ ప్రజలకు షష్టి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పురస్కరించుకొని అత్తిలిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలో ఇరగవరం మండలం ఐతంపూడి పేకేరు రాపాక గ్రామాల్లోని దేవాలయాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వార్త‌లు

దేశంలో అన్ని వర్గాల హక్కులు కాపాడుతున్న రాజ్యాంగం

దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశానికి దిశా దశ నిర్దేశించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.

వార్త‌లు

నిడదవోలుకు కళా, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తాం

:- మంత్రి కందుల దుర్గేష్ భవిష్యత్ తరాలు, పట్టణాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో నిడదవోలు పురపాలక సంఘం ముందుకెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మంత్రి కందుల దుర్గేష్ రాజకీయాలకి అతీతంగా పనిచేసే వ్యక్తిని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి నిడదవోలు: నిడదవోలు సమగ్ర స్వరూపాన్ని మార్చి కళా, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక

వార్త‌లు

త్వరలో రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజోలు: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే “జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని” రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి

వార్త‌లు

రైతులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలు

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత నాది ‘రైతన్న నీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయాన్ని అప్పటి నాయకులు నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో మంగళవారం ప్రారంభమైన రైతన్న నీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. అరాచకమైన పరిపాలనతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత

రూ. 1.40 కోట్లు వ్యయంతో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం సీసీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తణుకు రైల్వే స్టేషన్ రోడ్డును శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టామని చెప్పారు. మంగళవారం తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో

వార్త‌లు

ఉచిత కంటి వైద్యశిబిరం ద్వారా పేదలకు సేవలు

663 మందికి కళ్లజోళ్లు, 47 మందికి శస్త్రచికిత్సలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తణుకు పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఇప్పటి వరకు 663 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతోపాటు 47 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి

Scroll to Top