వార్త‌లు

ఆచంటలో ఘనంగా దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి

భారతీయ జనతా పార్టీ సిద్దాంత కర్త, జనసంఘ్ ద్వితీయ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి వేడుకలను ఆచంట మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆచంట మండల బిజెపి మాజీ అధ్యక్షులు ముచ్చర్ల నాగసుబ్బారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, జాతీయ సమైక్యత సమగ్రత కోసం బలమైన రాజకీయ పక్షం ఏర్పడాలనే కాంక్ష తో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో జన్ సంఘ్ […]

వార్త‌లు

తణుకులో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాల్ నందు ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున ఫార్మాసిస్ట్ లు సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యల పట్ల చర్చించి, ప్రజలకు మందుల వినియోగం పట్ల అవగాహన కల్పించాలని, మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించి వైద్యుల సూచనల మేరకు వారికి మాత్రమే యాంటిబయాటిక్స్ మందులు ఇవ్వాలని ఔషధ నియంత్రణ అధికారి మల్లిఖార్జున్ ఫార్మాసిస్ట్ ల కి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు

వార్త‌లు

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

వార్త‌లు

మెగాకల’ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

డీఎస్సీ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణమెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల ‘మెగాకల’ కలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థుల కల వేర్చి ఘనత సాధించిందన్నారు. డీఎస్సీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు

వార్త‌లు

తూర్పుగోదావరిజిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లాకలెక్టర్ డా. కీర్తి చేకూరి

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే

వార్త‌లు

వికాస ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న జాబ్ మేళా

— జిల్లా కలెక్టర్ – కీర్తి చేకూరి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి, “వికాస” ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27వ తేదీ (శనివారం) ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమీపంలోని వికాస కార్యాలయం (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలలో

వార్త‌లు

ఎర్రాయిచెరువులో పొలం పిలుస్తుంది – మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు

ఎర్రాయిచెరువు గ్రామసర్పంచ్ అధ్యక్షతన పోలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది దీనిలో భాగంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురుంచి మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు రైతులకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సార్వా సీజన్ నుండి గ్రేడ్ -A ధాన్యానికి రూ 2389 .00 మరియు సాధారణ రకమునకు రూ 2369 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారాని తెలియజేశారు. E- పంట నందు నమోదు చేసుకున్నటువంటి రైతుల నుంచి మాత్రమే

వార్త‌లు

కత్తవపాడు గ్రామములో స్వస్త్ నారీ – స్వశక్తి పరివార్ అభియాన్

ఇరగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కత్తవపాడు గ్రామము నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ  స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను కత్తవపాడు సర్పంచ్ మామిడి వరప్రసాద లక్ష్మి, సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు సమక్షంలో ప్రారంభించిరి . ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు వైద్యసేవలు అందించుటకు స్త్రీల వైద్య నిపుణులు, కంటిపరీక్షలు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్తపరీక్షలు, వృద్దులకు ఆరోగ్యపరీక్షలు, క్షయవ్యాది పరీక్షలు, సాదారణ

వార్త‌లు

ఎన్.ఎస్.ఎస్. ఆవిర్భావ దినోత్సవం

జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక యస్.కె.యస్. మహిళా కళాశాల డిగ్రీ & పీజీ (అటానమస్) ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మాట్లాడుతూ 1969 సం॥ము సెప్టెంబరు 24 తేదీ నుండి ప్రతీ సంవత్సరం ఎన్.ఎస్.ఎస్.డే గా జరుపుకుంటున్నామని, విద్యార్థులు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యమని, స్వచ్ఛభారత్, పరిసరాలను పరిశుభ్రం చేయడం, అక్షరాస్యత కార్యక్రమాలు, బాలిక విద్యా, మహిళా సాధికారత, మొక్కలు

Scroll to Top