వార్త‌లు

తణుకు నియోజకవర్గానికి గోదావరి జలాలు

ధవళశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా తరలింపు రూ. 54 కోట్లు వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన రూ. 1600 కోట్లుతో సంక్షేమం, అభివృద్ధి అమలు దువ్వలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం ధవళశ్వరం నుంచి పైపులైన్లు ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం ఈ పథకానికి […]

వార్త‌లు

సత్యసేవా సమితి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలి

శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణసత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన సేవాకార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అందర్నీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ సత్యసాయి చెబుతున్న ప్రవచనాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సత్యసాయి శత జయంతి పురస్కరించుకుని సత్యసాయి సంస్థ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను

వార్త‌లు

తణుకు పురుషుల శాఖా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవం

తణుకు, నవంబర్ 20, 2025 : దాతల సహకారంతో తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఉదయం, గత వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో అతిథిగా పాల్గొన్న స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, గ్రంథాలయాలు సందర్శించి విజ్ఞానం

వార్త‌లు

ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాలలో సి.పి.ఆర్ అవగాహన సదస్సు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా పి.జి కళాశాల (అటానమన్) తణుకులో – రోటరీ క్లబ్’- తణుకు వారి అధ్వర్యంలో సి.పి.ఆర్. అవగాహాన సదస్సును ఏర్పాటు చేశారు. కళాశాల ఫ్రీన్సిపాల్ కెప్టెన్ యు.లక్ష్మి సుందరీ బాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రోటరీక్లబ్ – తణుకు ప్రెసిడెంట్ డా ॥ కలగర వెంకట కృష్ట మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా మెగా వైద్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సి.పి.ఆర్ వంటివి నిర్వహించి ప్రజలను చైతన్య

వార్త‌లు

పుట్టపర్తి శతజయంతి ఉత్సవాల్లో భాగస్వామిని కావడం పూర్వ జన్మసుకృతం – మంత్రి కందుల దుర్గేష్

పుట్టపర్తికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు పుట్టపర్తి: పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబ శతజయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించే క్రతువులో మంత్రి కందుల దుర్గేష్ భాగస్వామి అయ్యారు. ఏపీ ప్రభుత్వం సత్యసాయి శతజయంతి ఉత్సవాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి కందుల దుర్గేష్ సభ్యుడు కావడంతో పరిశీలన బాధ్యతలు చేపట్టి భక్తులకు అందుతున్న ఏర్పాట్లను సహచర మంత్రులతో కలిసి స్వయంగా పరిశీలించారు.

వార్త‌లు

హిందూ సంప్రదాయాలని అపహాస్యం చేసిన వైసీపీ

తిరుపతి లడ్డూను సైతం కల్తీ చేసిన వైసీపీ నేతలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు బల్లిపాడు మదనగోపాలస్వామి ట్రస్టు బోర్డు అభినందన సభ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాలకులు సైతం తిరుపతి లడ్డూను పూర్తిగా కల్తీమయం చేశారని విమర్శించారు. అత్తిలి మండలం బల్లిపాడు మదనగోపాల స్వామి దేవస్థానం

వార్త‌లు

ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

తణుకు రోడ్‌ రన్‌ పేరుతో మారథాన్‌ డిసెంబర్‌ 7న తణుకులో ఏర్పాట్లు పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు రోడ్‌ రన్‌ రెండో ఎడిషన్‌ పేరుతో డిసెంబర్‌ 7న తణుకులో మారథాన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశంలో మహానగరాల్లో నిర్వహిస్తున్న మారథాన్‌లు

వార్త‌లు

అయిదేళ్లపాటు రైతులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ

ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ ద్వారా 16 వేల మంది రైతులకు రూ. 11.51 కోట్లు జమ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రి చిత్రపటాలకు రైతులు ధాన్యంతో అభిషేకం అయిదేళ్ల వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌

వార్త‌లు

పాలంగిలో ఘనంగా 72వ సహకార సొసైటీ వారోత్సవాలు

72వ అఖిలభారత సహకార వారోత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని జిల్లా సహకార అధికారి ముళ్ళపూడి వెంకటరమణ ఆవిష్కరించగా సొసైటీ చైర్పర్సన్ డాక్టర్ కాకర్ల నరసన్న జండా వదనం చేశారు. అనంతరం సహకార వారోత్సవాల్లో 6వ రోజు కార్యక్రమంలో భాగంగా పర్యాటక ఆరోగ్య హరిత శక్తి డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటగది వంటి సాధ్యమైన

వార్త‌లు

మత్స్యకారుల వ్యాపార వృద్ధికి ప్రభుత్వం అండ – మంత్రి కందుల దుర్గేష్

ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం క్రింద ఎఫ్ఎఫ్ పీవో గా ఏర్పడిన కోరుమామిడి ది వడ్డీస్ పిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీకి రూ.2,54,000 చెక్కను అందించిన మంత్రి కందుల దుర్గేష్ మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిడదవోలు: దేశంలోని మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మత్స్య రైతులు, మత్య్యకారులను సహకార సంఘం నుండి సమృద్ధి వైపు నడిపించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం

Scroll to Top