దేశంలో అన్ని వర్గాల హక్కులు కాపాడుతున్న రాజ్యాంగం
దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దేశానికి దిశా దశ నిర్దేశించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. […]










