వార్త‌లు

రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు

పశువైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 16 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పోస్టర్లు ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 20 వేలకు పైగా పశువులకు టీకాలు వేసే కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక […]

వార్త‌లు

దేశంలో ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట

ప్రధానమంత్రి మోడీ సహకారంతో నూతన రైల్వే మార్గాలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కేంద్రమంత్రి వర్మతో కలిసి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైలు మార్గాలను అభివృద్ధి చేసి అందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కామాఖ్య – చర్లపల్లి మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్

వార్త‌లు

ప్రజా సేవ కోసమే జనసేన ఆవిర్భావం: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిడదవోలు, ధవళేశ్వరంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన మంత్రి దుర్గేష్ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, జనసేనాని పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా సత్తా చాటారని వెల్లడి నిడదవోలులో భారీగా జనసేనలో చేరికలు – కండువా వేసి ఆహ్వానించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు:జనసేన పార్టీ కేవలం అధికారం కోసం కాకుండా, సమాజంలో మార్పు కోసం, ప్రజల పక్షాన

వార్త‌లు

ఘనంగా రేలంగిలో జనసేన 13వ ఆవిర్భావదినోత్సవం

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడీపీటీసీచుక్కా సాయిబాబు పాల్గొనడం జరిగింది. ప్రజాసేవ లక్ష్యంగా స్థాపించబడిన జనసేన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు ప్రజాసంఖ్యము కోసం అందరం ఐక్యతగా ముందుకు సాగాలని కోరుకుంటూ జనసేన టిడిపి బిజెపి ఐక్యతతో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నదమ్ముల

వార్త‌లు

నిడదవోలు రైతన్నల ఖాతాల్లోకి ఆర్థిక భరోసా

నిడదవోలు పట్టణంలో “పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఒక్కొక్కరి రూ.6000 చొప్పున 3వ విడతగా 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.10.75 కోట్ల ఆర్థికసాయం జమ చేశామని వెల్లడి ఒక్కొక్కరి రూ.20,000 చొప్పున ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.37.83 కోట్ల సాయం అందించామన్న మంత్రి దుర్గేష్ కోరుమామిడిలో గోశాలను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్ కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని

వార్త‌లు

16వ శతాబ్థపు తెలుగు రచయిత్రి మొల్లమాంబ

సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణం రచించిన మొల్ల మొల్ల జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం అభినదనీయం జయంతి వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు కుమ్మరి శాలివాహన కులంలో ఆణిముత్యంగా జన్మించిన మొల్లమాంబ 16వ శతాబ్దపు తెలుగు కవిత్రి అనీ తెలుగులో మొల్ల రామాయణాన్ని రచించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీర్చి దిద్దారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందని తెలిపారు.

వార్త‌లు

సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలు

మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ రేలంగిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన

వార్త‌లు

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

• ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన • నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం • పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి • గిరిపుత్రులతో కలసి మధ్యాహ్నభోజనం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరిపుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా

వార్త‌లు

దుష్టపాలనను అంతమొందిద్దాం – కారుమూరి నాగేశ్వరరావు 

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  డా.కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వార్త‌లు

ఘనంగా  నిడదవోలులో  వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి.శ్రీనివాస్ నాయుడు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపక్షపాతి నిరంతరం బడుగు బలహీనవర్గాల క్షేమం కోరుకునే జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో వైసీపీపార్టీ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం  మండల వైసీపీ అధ్యక్షులు

Scroll to Top