ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా 35 మంది గర్భిణీ స్త్రీలకు తణుకు నిసా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ స్త్రీ, ప్రసూతి వైద్యనిపుణులు డా.ఆయేషా ఖాన్ పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి. వైద్యురాలు డా. ఆర్. ఉషాదేవి కూడా గర్భిణీ స్త్రీలను పరీక్షించి, వారికి మందులు మరియు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డా. ఉషాదేవి మాట్లాడుతూ ప్రతీ గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా గర్భిణీ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, రోజూ ఒక కోడిగ్రుడ్డు ఉడక పెట్టినది తినాలని, రాత్రి పూట ఒక గ్లాసు పాలు తీసుకోవాలని, సాయంత్రం సమయంలో జామ, దానిమ్మ, కివీ, అవకాడో, డ్రాగన్ లాంటి ఎదో ఒక పండు, ఉదయం పూట ముందు రోజు రాత్రి ఎండు ఖర్జురం నాన పెట్టిన నీళ్లను తీసుకోవాలని, రోజూ రాత్రి నిదురించే ముందు ఒక ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవాలని చెపుతూ, ఈ విధముగా చేయుటవలన రక్తహీనత రాదని, తద్వారా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా మెరుగుపడతాయని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్. ఎన్ కె డి వి ఎల్ కుమారి, హెచ్.వి మేరీ రత్నకుమారి, స్టాఫ్ నర్సులు ఏ. సంధ్య, టి. ఝాన్సీ రాణి, ఏ. ఎం. ఎమ్స్, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


