వార్త‌లు

విద్యార్థులు  నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలి   

తణుకు పట్టణంలోని శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్.ఎన్.వి.టి.లో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సభ ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి సాధించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించగలరని ఆమె పేర్కొన్నారు. నేటిసమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. […]

వార్త‌లు

మన దశ – దిశ మార్చే బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు – ముళ్ళపూడి రేణుక

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన  బడ్జెట్లపై  రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక సొమవారం తణుకు క్యాంపు కార్యాలయంలో  పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వలన అభివృద్ధి అనేది ఎవిధంగా ఉంటుంది అనేది ఈ బడ్జెట్లను బట్టి అంతర్జాతీయ, జాతీయ, పరిస్థితులు ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో గేం చేంజర్ బడ్జెట్ అని, ప్రతి అంశాన్ని

వార్త‌లు

ఘనంగా పాలంగి రామేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి కళ్యాణం భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన శివాలయం కావడంతో పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు. నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు దర్శించుకుని ప్రత్యేక పూజా

వార్త‌లు

గోకర్ణేశ్వరస్వామికి లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం

తూర్పుగోదావరిజిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో శ్రీ చంద్రశేఖర సేవాసమితి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వరస్వామి వారికి శివరాత్రి లింగోద్భవకాలంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమపూజ, బిల్వపత్ర పూజలు జరిగినవి. ఈకార్యక్రమంలో ఆకెళ్ళ శ్రీనివాసరావు దోనేపూడి సుధాకర్. ఏలూరిపాటి సత్యకృష్ణ, కూచిభొట్ల సత్యనారాయణ, దోనేపూడి శ్రీరామ్ పవన్, కోడూరి సుబ్రమణ్యం, సి.హెచ్.బాలాజీ, మల్లాది రమణ

వార్త‌లు

మహాశివరాత్రికి మోర్త శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామికి విశేషపూజలు

ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గౌరీశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం బిల్వర్చనలు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహా పర్వదిన సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమం 3000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ గౌరీశ్వర స్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి

వార్త‌లు

నిడదవోలులో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిడదవోలు రూరల్ మండలం కాటకోటేశ్వరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారిని మంత్రి దుర్గేష్ ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణ తేజతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి

వార్త‌లు

మానవతా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ అలపాటి నాగేశ్వరరావు మృతి తీరని లోటు

ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ విద్యా కమిటీ చైర్మన్ అయిన అలపాటి నాగేశ్వరరావు శనివారం మృతిచెందినారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఉండ్రాజవరం  మండల మానవత  తరఫున పాలంగి గ్రామంలో ఆయన చిత్రపటానికి మానవత మండల శాఖ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మానవత మండల అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ సభ్యుడైన అలపాటి నాగేశ్వరరావు మరణం మానవత సంస్థకు తీరని లోటు అని అన్నారు. అదేవిధంగా

వార్త‌లు

గడువులోగా ఈ- పంట నమోదు చేయించుకోవాలి.

గడువులోగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈనెల 20వ తేదీ లోపు ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో బి రాజారావు రైతులను కోరారు. చిలకపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ- పంట నమోదు మరియు ఈ- కేవైసీ విధానాన్ని పరిశీలించడానికి వెళ్లిన సందర్భంలో రైతులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు సమయం ఇచ్చింది కాబట్టి రబీ సీజన్లో ఎవరైతే పంటను సాగు చేశారో వారి వివరాలను సంబంధిత రైతు

వార్త‌లు

‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది

:- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ టూర్ ఆపరేటర్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి దుర్గేష్ వెల్లడి గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక రంగం పరుగులు పెడుతోందని వెల్లడి విశాఖపట్నం: ‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక,

వార్త‌లు

బాలోత్సవం” గేయానికి నృత్యం చేసిన విద్యార్థినులను అభినందించిన కోట రామ ప్రసాద్

తణుకు, ఫిబ్రవరి 13, 2026 : విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ, వారి సూచనలు, సలహాల మేరకు విద్యలో ముందుకు సాగాలనీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యను అభ్యసిస్తూనే ముందుకు నడవాలని “రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ” అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, కోట రామ ప్రసాద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. తణుకు పట్టణంలోని టి. వేమవరం ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య

Scroll to Top