వార్త‌లు

పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్

హర్షం వ్యక్తం చేసిన రైతాంగం నిడదవోలు: పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా అన్నదాతలకు సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సకాలంలో […]

వార్త‌లు

తణుకు బ్రాంచ్లో బీమాసఖి మొదటి వార్షికోత్సవ సంబరాలు

ముఖ్యఅతిథిగా ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ సేల్స్ మేనేజర్ శర్మ మహిళా సాధికారత లో భాగంగా ప్రధానమంత్రి మోడీ చే డిసెంబర్ 9 వ తేదీ 2024 న ప్రారంభించబడిన బీమాసఖి స్కీమ్ మొదటి వార్షికోత్సవం సంబరాలు డిసెంబర్ 9వ తేదీ మంగళవారం తణుకు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ సేల్స్ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ భీమా సఖిలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు

వార్త‌లు

తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక స్కూల్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక నిడదవోలు : పెరవలి మండలం తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. విజయవాడ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ కు తీపర్రు గ్రామంలో ఏటిగట్టు పై నుండి ఉదయం

వార్త‌లు

పశ్చిమగోదావరి ఏ.ఐ.ఎస్.బి. నూతన జిల్లాకమిటీ ఎన్నిక

ఆల్ ఇండియన్ స్టూడెంట్ బ్లాక్ (AISB) రాష్ట్ర విద్యార్థి సంఘనాయకుల ఆదేశాల నేపద్యంలో సోమవారం తణుకులో పశ్చిమగోదావరి జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కొత్త నూతనకమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులను కమిటీలో ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్‌గా దున్న వెంకట్, వైస్ ప్రెసిడెంట్‌గా గంగోలు సాయి, తణుకు టౌన్

వార్త‌లు

ఆలయాల అభివృద్ధికి రూ. 7.80 కోట్లు మంజూరు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని మూడు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం 7.80 కోట్లు మంజూరు చేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరగవరం మండలం రేలంగి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి రూ. 3 కోట్లు, తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయానికి రూ. 3 కోట్లు, వేల్పూరు రుద్రేశ్వర స్వామి ఆలయానికి రూ. 1.80 కోట్లు ప్రభుత్వం

వార్త‌లు

గోదావరి పుష్కరాల నాటికి కోటసత్తెమ్మ తల్లి ఆలయ ఆధునికీకరణ పనులు పూర్తి

:- మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ కోటసత్తెమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని సారె సమర్పణ నిడదవోలు పట్టణంలోని నంగాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహణ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ఆశీర్వదించాలని ప్రార్థన నిడదవోలు: కోట సత్తెమ్మ ఆలయ ఆధునికీకరణ పనులు చేపట్టి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు

వార్త‌లు

శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం

సమిశ్రగూడెం బేతస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు జగతికి శాంతి సందేశమిచ్చిన మహానుభావుడు ఏసు ప్రభువు అని వెల్లడి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన ఏసు ప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం బేతెస్థలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

తణుకు పీస్ ఆఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 18వ వార్షిక యూత్ క్రిస్మస్

క్రిస్మస్ సందేశం బ్రదర్ జేమ్స్ యూదుల రాజుగా మనకు రక్షకుడు దయించాడని రాజులకు రాజు రారాజు యేసుక్రీస్తు అనుసరించి నడుచుకోవాలని మనల్ని పరిపాలించేవాడు ఏసుక్రీస్తుని, మనల్ని పరిపాలించడానికి ఈ లోకంలో జన్మించాడని పాపులమైన మన కొరకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని మానవ రూపంలో మహాత్ముడిగా జన్మించాడని జేమ్స్ మాట్లాడారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ , తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్

వార్త‌లు

త్వరలోనే దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్

:- మంత్రి కందుల దుర్గేష్ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా నిడదవోలు: దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, త్వరలోనే దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని

Scroll to Top