శోభాయాత్ర కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు – మన ధర్మానికి ప్రతీక
వేల్పూరు గ్రామంలో శ్రీరాముని మహిమను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించిన శ్రీ రామ శోభాయాత్ర భక్తి, ఐక్యత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెరక వీధి రామాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా విస్తరించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆకట్టుకుంది. “ఐక్య హిందూ సమాజం” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమత భేదాలకు అతీతంగా భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. […]










