వార్తలు
ఆలపాటి నాగేశ్వరరావు సేవలు ఎందరికో స్పూర్తి
ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు విద్యాకమిటీ చైర్మన్ అయినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు అకాలమరణానికి చింతిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. మండల మానవతా శాఖ ప్రతీనెలా నెల 22వ తారీకున నెలవారి సమావేశం జరుగవలసిఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదావేయడం జరిగిందని ఉండ్రాజవరం మండలం మానవతా సంస్థ ప్రెసిడెంట్ ఉప్పలపాటి శ్రీనివాసు తెలిపారు. ఆ సమావేశాన్ని ఆదివారం ఉండ్రాజవరం లింగాలపేట రామాలయంలో నెలవారీ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు
వార్తలు
“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత
“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత సాధనలో భాగంగా ‘జాగృతి” డిజిటల్ మహిళా సంఘం సంఘం అధ్యక్షురాలు భూపతిరాజు శశిరేఖ, సెక్రటరీ భూపతిరాజు వాణి, కోశాధికారి యలమంచిలి రేణుక, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం. జయలక్ష్మి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళలు తయారుచేస్తున్న ఆహార పదార్థాలు, హస్తకళా ఉత్పత్తులు, గృహోపయోగ
వార్తలు
విండీస్పై గెలుపు..
సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు సత్తా చాటింది. విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ కు అర్హత సాధించింది.విండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్నిమరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ సంజు శాంసన్ (97*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.
వార్తలు
నేషనల్ సైన్స్ డే సందర్భంగా కెరీర్ గైడెన్స్ సదస్సు
సర్ సి.వి. రామన్ జయంతి వేడుకల్లో విద్యార్థులకు మోటివేషన్… సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే నేషనల్ సైన్స్ డే సందర్భంగా తణుకు సి.ఎం కన్వెన్షన్ హాల్లో విహాన్ కాలేజ్, రూట్స్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి జీవితంలో మొదటి ముఖ్య ఘట్టమని, మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు
వార్తలు
తేతలిలో ఘనంగా సైన్స్ దినోత్సవం
తేతలి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ మరియు సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సైన్స్ ఉపాధ్యాయులు పి. గంగాభవాని, బి.ఎం.గోపాల రెడ్డి, డి.వి.ఎస్. మారుతిరామ్, పిడి వెంకటేశ్వరరావు విద్యార్థులలో ప్రేరణ కలిగించే, మూఢనమ్మకాల గుట్టు విప్పే మ్యాజిక్ లు ప్రదర్శించారు.సైంటిఫిక్ మెజీషియన్ గోపాల రెడ్డి కొబ్బరికాయపై మంటలు, సీసాలో దయ్యాన్ని బంధించడం, విద్యార్థి తలపై
వార్తలు
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
మండలానికి స్వచ్ఛ రథం కేటాయించిన ప్రభుత్వం కొండాయపాలెంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి
వార్తలు
దర్జీసోదరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహాయం చేయాలి
తణుకు పట్టణంలోని 20వ వార్డు సంగుల వారి వీధిలో శనివారం టైలర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో కుట్టు మిషన్ రూపకర్త ఇలియాస్ హోవ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం సంఘనాయకులు టైలర్స్ వృత్తి ప్రాధాన్యతను వివరించారు. సంఘం అధ్యక్షుడు కత్తుల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు రెడ్డి సూర్యనారాయణ, కోశాధికారి గుత్తుకొండ సుబ్బారావు, కార్యదర్శి నూకెళ్ళ వెంకటరత్నం, ముంగండ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో దర్జీ వృత్తిదారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
వార్తలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోడపత్రిక విడుదల
(భీమవరం) మార్చి 8వ తేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదరణ సేవా ఫౌండేషన్ రూపొందించిన గోడపత్రిక శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలి అంటే చదువు ప్రామాణికంగా తీసుకోవాలని విద్య మధ్యలో నిలిపివేసిన బాలికలను గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చేరేలా చేసి వారి చదువును కొనసాగేలా స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా స్త్రీల అభ్యున్నతికి పేదల
వార్తలు
కోరుమామిడి గ్రామంలో కోకో రైతులకు అవగాహన సదస్సు
నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో కోకో రైతులకు అవగాహన సదస్సు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కోకో సాగు చేసుకునే రైతులకు కు ఫెర్మెంటేషన్ విధానానికి 70 శాతం రాయితీ ఉంటుందని డి. హెచ్. ఓ. తూర్పుగోదావరి జిల్లా వివరించారు. 35% ఎం.ఐ.డి.హెచ్. ద్వారా 35 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రాయితీని పొందవచ్చని కోకో రైతులకు తెలియజేశారు. ఈ రాయితీని పొందాలంటే బ్యాంకు లోన్ కి అప్లై చేసుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ డ్రిప్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్









