వార్త‌లు

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి

తణుకు పురుషుల గ్రంధాలయంలో సోమవారం ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని వేసవి శిక్షణశిబిరం యందు శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/విద్యార్ధులకు గ్రంథాలయ అభివృధి కమిటీ అధ్యక్షులు శ్రీమతి వావిలాల సరళదేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల యెడల తల్లితండ్రులు శ్రద్ధ వహించాలని, ఆర్ధిక పరిస్థితుల వల్ల కూడా పిల్లలు ఇళ్లనుండి పారిపోవుట, చదువు మీద శ్రద్ధలేఖ, తల్లితండ్రుల ప్రవర్తన ద్వారా ఇంటినుండి వెళ్ళిపోవుటా జరుగుతుందని, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ […]

వార్త‌లు

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో జిల్లా నేతల సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసానికి విచ్చేశారు.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు, నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయకర్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వలవల

వార్త‌లు

రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

ఘనస్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటన నిమిత్తం రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టన్ వద్ద రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రేపు (సోమవారం) రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని

వార్త‌లు

ఎస్సీ హోదా మన హక్కు

దళిత క్రైస్తవులంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి తణుకులో దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ విజయవంతం దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధనకోసం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన కోసం జరిపే ఉద్యమాలకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తణుకు దళిత క్రైస్తవ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తణుకు స్థానిక శ్రీ భాగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపంలో దళిత క్రైస్తవ రాజ్యాంగబద్ధ హక్కుల సాధన సభ పేరిట నిర్వహించిన

వార్త‌లు

స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తనిఖీ

స్టార్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత మృతి సంఘటనపై ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు డిఎంహెచ్వో తెలిపారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి రికార్డులు, చికిత్స విధానం, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది నుండి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.ప్రాథమిక విచారణలో మృతి చెందిన బాలింత బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిగా గుర్తించినట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీ మే 9, 2026న హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించుకున్నట్లు, అనంతరం రాజమండ్రిలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు సమాచారం లభించినట్లు చెప్పారు. అక్కడి నుండి పూర్తిస్థాయి గర్భధారణ

వార్త‌లు

కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్ రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పుష్కర ఘాట్ వద్ద ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్

వార్త‌లు

పొక్సో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి

పొక్సో చట్టం పై అవగాహన కొరకై బాలబాలికలకు తణుకు, సజ్జాపురం రామకృష్ణ సేవా సమితియందు శనివారం రాష్ట్రన్యాయ సేవల సంస్థ, అమరావతి ఆదేశముల మేరకు రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కే. కృష్ణవేణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వేసవి శిక్షణశిబిరంలో శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/ విద్యార్ధులకు పొక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ మాట్లాడినారు. అపరిచితులు, పరిచయం లేని వారు ఇచ్చే బహుమతులు, మాటలు నమ్మకూడదని, కొన్ని ముఠాలు పిల్లలకు

వార్త‌లు

మోర్తలో ఘనంగా హనుమజయంతి అన్నసమారాధన

మోర్తగ్రామంలో కొత్తపేట వద్ద వేంచేసియున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మంగళవారం హనుమ జయంతి సందర్భంగా ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్ ను శాలు వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పరిసర గ్రామాల నుండి భారీగా మహిళలు,

వార్త‌లు

గన్నమని జన్మదినం సందర్భంగా ఉచితంగా పుస్తకాలు పెన్నులు పంపిణీ

ఉండ్రాజవరం గ్రామంలో తాము అభిమానించే నాయకుని జన్మదినం సందర్భంగా మంగళవారం శ్రీ కోదండ రామా శెట్టిబలిజ సంఘ రామాలయం వద్ద ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా గ్రామ పురోహితులు శ్రీ జ్యోశ్యుల సుబ్రహ్మణ్యంచే కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, అనంతరం ఉచితంగా 100 మంది బాలబాలికలకు పుస్తకాలు, పెన్నులు  తమ నాయకుని చేతులమీదుగా అందజేశారు గన్నమని అభిమానులు. భారీ కేక్ కటింగ్ చేసి పిల్లలకు పంచిపెట్టారు.

Scroll to Top