వార్త‌లు

అణగారిన వర్గాల అభ్యున్నతికోసం కృషి చేసిన పూలే

సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలుఅణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి పురస్కరించుకొని శనివారం తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు […]

వార్త‌లు

రీ సర్వే పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి

రైతుల సమక్షంలోనే రీ సర్వే కొలతలు చేపట్టాలి గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్ సచివాలయ సేవల్లో జవాబుదారీతనం, పారదర్శకత అవసరంరైతులతో ముఖాముఖి – రీ సర్వేపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, మార్గదర్శకాల ప్రకారం పనులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశంపై అధికారులను

వార్త‌లు

అంతర్జాతీయ క్రియేటివ్ ఎకానమీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

ముంబయిలో జరుగుతున్న 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా లో ఈరోస్, రెడ్ బుల్ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు..పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో మంత్రి దుర్గేష్ కీలక చర్చలు ముంబయి వేదికగా ఏపీ పర్యాటక ప్రగతిని చాటిచెప్పిన మంత్రి దుర్గేష్..అమరావతి కేవలం నగరం కాదు.. ఇదొక అంతర్జాతీయ క్రియేటివ్ హబ్ గా ప్రకటన అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల అనుసంధానం చేస్తూ స్టోరీటెల్లింగ్ కారిడార్ కు చర్యలు హోలోగ్రాఫిక్ స్టోరీటెల్లింగ్ టెక్నాలజీతో

వార్త‌లు

ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శ

ఎమ్మెల్సీ వంక రవీంద్రనా«ద్‌ను బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి, సీపీఐ, మహిళా సమాఖ్య సీనియర్‌ నాయకులు వంక నాగమణి మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. నాగమణి భర్త వంక సత్యనారాయణ సైతం ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో అసెంబ్లీ టైగర్‌గా

వార్త‌లు

వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి మార్టేరు కిసాన్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని చెప్పారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మార్టేరు గ్రామంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో

వార్త‌లు

అట్టహాసంగా సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సత్కార సభ

తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సత్కార సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరై పదవి విరమణ పొందిన సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌ల పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో

వార్త‌లు

సామాజిక,ఆర్ధిక అసమానతలు అంతానికి శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలి…

ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ… ​తణుకు,ఏప్రిల్ 7దేశంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక అసమానతలను అంతమొందించేందుకు సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు సంపద పునః పంపిణీ జరగాలని, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి.వి.వి.ఎస్. వర్మ పిలుపునిచ్చారు.​మంగళవారం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో “సామాజిక న్యాయం – ఆర్థిక అసమానతలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి

వార్త‌లు

ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

తణుకు పట్టణానికి చెందిన దాత చిట్టూరి సుజాత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంతో మంది ప్రయాణికుల దాహార్తిని తీర్చే విధంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చిట్టూరి అచ్యుత రామ ప్రసాద్ జయంతి పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సుమారు రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే

వార్త‌లు

ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణప్రతి ఒక్కరిలో సేవా గుణాన్ని పెంపొందించే విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చిట్టూరి సుజాత సంయుక్త ఆధ్వర్యంలో తణుకులో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న దాతలు

వార్త‌లు

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కందుల దుర్గేష్

మోరంపూడి పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్ శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు సేవా పురస్కారాల ప్రదానం రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని మోరంపూడి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య

Scroll to Top