వార్త‌లు

ప్రతీ రైతు పంటల బీమాపథకం నందు నమోదు చేసుకోవాలి

తణుకు మండలంలోని కొమరవరం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కే.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం. వి. రమేష్ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నందు ప్రతి రైతు ఆగస్టు 15 లోపుతాము ఈ సార్వా కాలమునందు పండించిన ప్రతి ఎకరం వరి పొలమును పంటల బీమా పథకం నందు నమోదు చేసుకోవాలని తెలియజేశారు, […]

వార్త‌లు

రైతులు తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలి

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం కొవ్వూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సహాయకులు సి.హెచ్. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి, మినుము మరియు అరటి పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. మనిషికి ఎలా బీమా చేసుకుంటామో, పంటలకు కూడా భీమా చేసుకోవడం వల్ల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా దిగుబడు తగ్గితే బీమా పొందే అవకాశం ఉంటుందన్నారు. అరటి

వార్త‌లు

ఇరగవరం మండలంలో స్వర్ణ ఆంధ్ర  స్వచ్చ ఆంధ్ర

ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే  స్వర్ణ ఆంధ్ర  స్వచ్చ ఆంధ్ర  ఇరగవరం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ యందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా  కమిషనర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్  ఆదేశాలు అనుసరించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలో  ప్రత్యేక దృష్టి సారించి విస్తృత స్థాయిలో నిర్వహించారు.ప్రతి కుటుంబ పొడి చెత్తను వేరుగా సంచుల్లో నిల్వచేసి స్వచ్ఛరథంకు ఇవ్వాలని అవగాహన కల్పించారు  తడి చెత్తను ప్రతిరోజు గ్రీన్

వార్త‌లు

స్వచ్చ నరసరావుపేట కొరకు మనమంతా కృషిచేయాలి – అరవిందబాబు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే పట్టణంలో స్థానిక SSNకళాశాలలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొని కళాశాల లో స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు కళాశాలలో విద్యార్థుని విద్యార్థులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు పరిశుభ్రమైన నరసరావుపేట నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సూచించారు స్వచ్ఛత,పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజల సహకారంతో పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి తెలిపారు

వార్త‌లు

తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో  జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ 

మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, శనివారం తణుకు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ” జగన్ 2.0 సూపర్ యాప్ ” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వైఎస్సార్సీపీ  నాయకులు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని, వారిని మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలకు నేరుగా అనుసంధానం చేయడం, ప్రజాసమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతోనే “జగన్ 2.0 సూపర్ యాప్” ను

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

 కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన, లోక్ సత్తా అధ్యక్షుడు, డా.జయప్రకాశ్ నారాయణకు సభికులందరూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ గత సంవత్సరం సాధించిన విజయాలు, యీ సంవత్సరం వేసుకొన బృహత్ ప్రణాళిక విని సంతోషించారు. వివిధ పాఠశాలకు మంచినీటి సౌకర్యం, విద్యాఖివృదిధికి సమాజసేవకు పోలియో నిధిసేకరణ, సభ్యుల సంఖ్యను పెంచినందుకు బెస్ట్ క్లబ్ అవార్డ్ సాధించినందుకు అభినందించారు. వివిధ శాఖల్లో 26 అవార్డులు సాధించడం జరిగింది.డా.జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ గతంలో తాను, జిల్లా

వార్త‌లు

ఇరగవరం ఎంపిడిఓ కార్యాలయంలో స్వచ్చ భారత్ మిషన్ శిక్షణ

మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు  2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన స్వచ్చ భారత్ మిషన్ శిక్షణా తరగతులు  గురువారం మొదలయ్యాయి. ఈ శిక్షణలో బహిరంగ మలవిసర్జన నిర్మూలన ను 100% సాధించడం, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు వినియోగం  వంటి అంశాలపై  మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదరు శిక్షణా కార్యక్రమము లో పంచాయతీ అభివృద్ధి అధికారులు బహిరంగ మలవిసర్జన నిర్మూలన  100% సాధించడం, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించడం, సంబంధిత నిబంధనలు మరియు చట్టాల

వార్త‌లు

యువత ఉజ్వల భవిష్యత్తుపై అవగాహన సదస్సు

స్థానిక ఎస్ కే ఎస్ డి విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన యువత ఉజ్వల భవిష్యత్తుపై అవగాహన సదస్సు గురువారం కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానం చెబుతూ నాయకులను ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నుకున్నప్పటికీ నిస్వార్ధమైన సేవకు అందుబాటులో లేరని అన్నారు. నిజాయితీ సమర్థత నిస్వార్ధం ఈ మూడు నాయకులలో ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుందని

వార్త‌లు

ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం” 

ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  గోటేరు గ్రామంలో జడ్ జడ్.పి.హైస్కూల్ వద్ద “డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం” అవగాహన కార్యక్రమాన్ని ను సబ్ యూనిట్ ఆఫీసర్ జి. వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ “వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులలో భాగంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజూ డ్రైడే గా పాటించడం ప్రతి ఒక్కరూ ప్రాథమిక భాధ్యతగా గుర్తించి ఆచరించాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, చేతుల శుభ్రత పాటించడం, ఆహార పదార్థాలు ఉన్న

వార్త‌లు

పరిశుభ్రమైన మార్కెట్ – పర్యావరణ పరిరక్షణే లక్ష్యం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకులో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆరు డస్ట్ బీన్స్ తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మార్కెట్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈ బిన్లలో వేయడం ద్వారా ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది వాటిని సేకరించి తరలించే విధంగా

Scroll to Top