వార్త‌లు

“భూ శాంతి మహాయజ్ఞం” వంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వేళ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ముళ్ళపూడి కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రేమగా పలకరించి సెల్ఫీలు,ఫోటోలు దిగిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.మీ ప్రేమ, ఆప్యాయతే నాకు సేవాభావాన్ని, బాధ్యతను పెంచి నిరంతరం ప్రజాసేవలో ముందుకు నడిపించే శక్తి అవుతుంది.

వార్త‌లు

తణుకు నుండి మహాశివరాత్రికి శ్రీశైలం ప్రత్యేకయాత్ర బస్సులు

ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో నుండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠమైన అతి మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైలం కి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనానికి ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ 2 + 2 ఆడియో వీడియో కోచ్ బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని టికెట్ ధర పెద్దలకు 820/-, పిల్లలకు 450/- అని మరియు శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ, చినకాకాని,మంగళగిరి క్షేత్రాలు దర్శించేటట్లు ప్రత్యేక

వార్త‌లు

యర్రమిల్లి నరసింహారావుకు ఘన నివాళి

తణుకు : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు యర్రమిల్లి నరసింహారావు స్వరాజ్య ఉద్యమంలో యువజనోద్యమంతో ప్రారంభించి గాంధీజీ నాయకత్వంలో సాగిన జాతీయోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారని శ్లాఘిస్తూ పలువురు పురప్రముఖులు  సమరయోధుల పార్కు లోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు,దారి దీపం సంపాదకులు డి.వి. వి.యస్.వర్మ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో ఏర్పడిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా తదనంతరం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అనుచరుడిగా సోషలిస్టు భావాల వ్యాప్తికి విశేషమైన కృషిచేశారని,

వార్త‌లు

జగన్ మోహన్ రెడ్డి చేయాల్సింది పరామర్శలు కాదు ప్రాయశ్చిత్త దీక్షలు

జగన్ పర్యటనలు ‘పరామర్శ’ కోసం కాదు, చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం అమరావతి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్నవి పరామర్శ యాత్రలు కావని, గత ఐదేళ్లలో చేసిన అరాచకాలకు ‘ప్రాయశ్చిత్త దీక్షలు’ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో

వార్త‌లు

సమిష్టికృషితో 2027 గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలి: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల సన్నద్ధతపై తొలి ప్రాథమిక సమీక్ష కుంభమేళా తరహాలో ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టే’ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఏ ఘాట్‌లో స్నానం చేసినా పుణ్యఫలం ఒకటే – భక్తులలో అవగాహన కల్పించాలని నిర్ణయం రూ. 97 కోట్లతో ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’ పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడి రాజమహేంద్రవరం: సమిష్టి కృషితో 2027 జూన్ 26న ప్రారంభమై 12 రోజులపాటు కొనసాగి జులై 7న ముగిసే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా,

వార్త‌లు

బీజేపీ సహకారంతో రాష్ట్రంలో మరింత అభివృద్ధి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు  నియోజకవర్గ అభివృద్ధిలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ సహకారం తణుకు నియోజకవర్గ బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతోనే తణుకు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకు కూటమి

వార్త‌లు

బీసీల సంక్షేమానికి మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి కందుల దుర్గేష్

డి.ముప్పవరంలో రూ. 20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభం నిర్మాణంలో ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ పనుల పరిశీలన మహిళలు, బీసీల ఆర్థిక ప్రగతియే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడి నిడదవోలు (అక్షరభూమి) నిడదవోలు: కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి,మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్  పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు రూరల్ మండలం డి.ముప్పవరం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత

వార్త‌లు

భీమవరంలో బీజేపీ శ్రేణుల సమాలోచన

భీమవరం పగోజిల్లా కేంద్రం భీమవరంలో బీజేపీ శ్రేణులకు నిర్వహించిన మేధోమదన కార్యక్రమం  “సమాలోచన” శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అఖిల భారతీయ సహ సంయోజక్ “శ్రీ చంద్రకాంత్ శర్మ జి” (ప్రజ్ఞ ప్రవాహ్) పాల్గొనడమైనది. “చంద్రకాంత్ శర్మ జి”  లండన్ కేంద్రముగా విశ్వవిభాగ్ ప్రచార ప్రముక్ గా 15 సంవత్సరాలు, 20 దేశాలలో ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, మరియు అమెరికా దేశాలలో ప్రవాస్ గా సేవలందించారు. ఈ సందర్భంగా ఏ.పి.బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ ఈ కార్యక్రమం

వార్త‌లు

స్టేట్ లెవల్ లో  రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ

తణుకు  సుచిరిండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడిన సర్.సి.వి. రామన్ స్టేట్ లెవల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలంపియాడ్ లో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్. కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన సర్.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ నైట్ లో సుచిరిండియా ఎమ్.డి. అండ్ సి.ఇ.వో వై.కిరణ్, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతమనేని

Scroll to Top