వార్త‌లు

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు

ఫలితాల్లోనూ అదే జోరు కనబరచుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడి పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో […]

వార్త‌లు

సూర్యలంక బీచ్ లో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0

సూర్యలంక బీచ్ లో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్లతో చేపడుతున్న సమగ్ర అభివృద్ధి పనులను సమీక్షించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహచర మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ , బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ ఛైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ మరియు జిల్లా అధికారులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా “Bay of Bapatla” పేరుతో సూర్యలంకకు ప్రత్యేక బ్రాండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యలంక

వార్త‌లు

ప్రపంచం మెచ్చిన  మోదీపై  విమర్శలా? 

బీజేపీ అధికార ప్రతినిధి – డా. ముళ్ళపూడి రేణుక ఫైర్ తణుకు, మే 12:తణుకు పట్టణంలోని చిట్టూరి హెరిటేజ్ హోటల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ప్రపంచ దేశాలు

వార్త‌లు

బి.జె.పి.ఆధ్వర్యంలో జనతా వారధిపై జె.సి.కి వినతిపత్రం

“జనతా వారధి” కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాకు సంబంధించిన భూగర్భ జలాల పరిరక్షణ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ చేపట్టిన “క్యాచ్ ది రెయిన్” కాన్సెప్ట్ అమలుపై భారతీయజనతాపార్టీ తరుపున జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ టి. రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ వినతిపత్రంలో జిల్లాలోని చెఱువుల పూడికతీత, ఇంకుడు గుంటల నిర్మాణం, రీఛార్జి గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా చేపట్టి, ప్రతి నీటి చుక్కను

వార్త‌లు

మండువేసవిలో చల్లని చెట్టునీడ లాంటి సినిమా గొదారి గట్టుపైన

కోస్టల్ న్యూస్: (తణుకు మే 08) గోదావరి పల్లెటూరి అందాలతో… ఆప్యాయత అనురాగాలతో పెనవేసుకున్న సాధారణ కుటుంబాల మధ్య సాగే ఇతివృత్తంతో ఆద్యంతం తండ్రీకూతుళ్ళ మధ్య, ఒక వ్యవసాయదారుని కుటుంబంలో నుండి ఆటోడ్రైవర్ గా జీవనం సాగించే హీరో, అతను పాటించే కుటుంబవిలువలు వీటిమధ్య సాగే ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఆటో అబ్బాయిని ఎలా ప్రేమించిందో దర్శకుడు రసవత్తరంగా తెరకెక్కించిన గోదారిగట్టుపైన చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా తణుకు వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రంలో పొలీసుపాత్రలో

వార్త‌లు

తణుకులో భారీ గోల్డ్ బిస్కెట్ స్కామ్ ఆరోపణలు.. 25 కోట్ల మోసం జరిగిందన్న బాధితులు

మాయా లేడి- నయా మోసం తణుకు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న డా.బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజావేదిక అధ్యక్షుడు చోళ్ళ రాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణం సజ్జాపురానికి చెందిన కొత్తమసు స్నేహలత, అజ్జురి దుర్గాప్రసాద్ అనే జంట గోల్డ్ బిస్కెట్లు, బంగారు వస్తువుల వ్యాపారం పేరుతో పలువురిని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 25 మందికి పైగా

వార్త‌లు

విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం

కూటమి ప్రభుత్వంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 1.77 కోట్లుతో విద్యుత్తు లైను నిర్మాణ పనులు ప్రారంభం దువ్వ నుంచి అత్తిలి వరకు విద్యుత్తు లైను నిర్మాణం అత్తిలి మండలంలో గలా అని గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం పరిధిలోని

వార్త‌లు

అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ – గర్భిణికి అండగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు పట్టణంలో అర్థరాత్రి సామాన్య వ్యక్తిలా బైక్‌పై పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, డ్యూటీ డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఇదే సమయంలో హై బీపీతో అత్యవసర పరిస్థితిలో ఏలూరుకు రిఫర్ అయిన తణుకు రెండవ వార్డుకు చెందిన గర్భిణి అనూషకు ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి

వార్త‌లు

వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచిన  రూట్స్ స్కూల్ విద్యార్థులు

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ విద్యార్థులు వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తణుకు టౌన్ ఫస్ట్ సాధించిన రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థిని పి.బాల సత్య హరిణి 596/600 ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి

వార్త‌లు

మనసు కవి మహాకవి ఆత్రేయ…!

 సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రాంగణ మందు ఆచార్య ఆత్రేయ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు.   సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ కథ చిత్ర పాత్రోచిత మైన పాటలు, మాటలు రాసిన ఆత్రేయ మనసు కవి మహాకవి అని అన్నారు.   పై సందర్భంగా ఆత్రేయ రచించిన పాటలు, జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించారు పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.   అనంతరం స్కూల్ ఉపాధ్యాయుడు చీలి రాజును,

Scroll to Top