వార్త‌లు

కూటమితోనే మత్స్యకారుల అభివృద్ధి సాధ్యం

ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య విశాఖపట్నం: ఏప్రిల్ 3 (కోస్టల్ న్యూస్) మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదిటి అర్జున, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు అన్నారు. డాబాగార్డెన్స్, వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గంలో గల 14 ఉప కులాలకు వారి […]

వార్త‌లు

ఉసులుమర్రులో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి పనుల పరిశీలన.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం నిడదవోలు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య కేంద్రం

వార్త‌లు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం.. 23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం

:- : మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ రేపటి నుండే రబీ సీజన్ ధాన్యం సేకరణను ప్రారంభిస్తున్నామని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి..రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటన రైతు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ ..దళారులను నమ్మి మోసపోవద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాలో సాధారణ స్థితి.. తగ్గుతున్న బ్యాక్‌లాగ్ బుకింగ్స్ నిడదవోలు

వార్త‌లు

అమరావతిలోని పూలే మండల్ భవన్‌లో బోడె రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహార దీక్ష

ప్రజాస్వామ్యాన్ని ప్రక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ, బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు తీవ్ర ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరం అని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 11వ

వార్త‌లు

అమరావతి రాజధాని బిల్లు ఆమోదం.. నిడదవోలులో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు

నిడదవోలు: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ లో ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమరావతి బిల్లు ఆమోదానికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు

వార్త‌లు

అమరావతి రాజధానికి చట్టబద్ధత పట్ల సంబరాలు

తణుకు నియోజకవర్గంలో కూటమి శ్రేణుల వేడుకలు అమరావతి రాజధానికి లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు గురువారం తణుకు పట్టణంలోని స్థానిక నరేంద్ర సెంటర్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కేకు కట్‌ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి వేడుకలు చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్ నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు ర్యాలీ చేసి అమరజీవి పొట్టి

వార్త‌లు

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులోని అనుసరించి సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇరగవరం మండల కేంద్రంలో లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కామనమునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలన్నిటిని మార్చి వేసిందని 44 లేబర్ చట్టాలను మార్చివేసి నాలుగు లేబర్ కోడ్స్ గా ఏర్పాటు చేసిందని అన్నారు. పనిచేసే కార్మికునికి

వార్త‌లు

100 రోజులు టి.బి. స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేయాలి

ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న 100 రోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు వైద్యా ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ ఎన్. వసుంధర పేర్కొన్నారు. బుధవారం ప్రస్తుతం అమలవుతున్న వందరోజుల హై రిస్క్ టిబి స్క్రీనింగ్ కార్యక్రమం భాగంగా చాగల్లులో నిక్షయ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ నిడదవోలు టి.బి. యూనిట్ లో ముందుగా గుర్తించిన హైరిస్క్ గ్రామాల్లో 14 సం లోపు వారిని మినహాయించి మిగిలినవారు

వార్త‌లు

గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం

కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్లు నిర్మాణంపై దృష్టి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి రూ. 3.80 కోట్లతో మంచిలి- కంచుమర్రు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మాణపై దృష్టి సారించి ఇప్పటివరకు సుమారు రూ. 8 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి నుంచి

Scroll to Top