80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజేపి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలాలతో నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, ఆంగ్లేయుల అకృత్యాలనుండి స్వతంత్రం వైపు నడిపించిన దేశ నాయకులను మనం ఎల్లవేళలా స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా సెక్రటరీ బూరుగుపల్లి శివరామకృష్ణ, బిజేపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




