(తణుకు , ఆగస్టు 27:
తణుకు పట్టణంలోని రూట్స్ పాఠశాలలో సజ్జాపురం లయన్స్ క్లబ్ మరియు భారత్ బయోటెక్ వారి ఆధ్వర్యంలో టైఫాయిడ్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. లయన్ డాక్టర్ గుత్తుల బాలసుబ్రమణ్యం సూచనలతో 250 మంది విద్యార్థినీ విద్యార్థులకు టైఫాయిడ్ నివారణ టీకాలు వేశారు.
ఈ కార్యక్రమంలో సజ్జాపురం లయన్స్ క్లబ్ కార్యదర్శి లయన్ గమిని రమేష్, సీనియర్ సభ్యులు లయన్ పుట్టా రామచంద్రరావు, జిల్లా గ్లోబల్ యాక్షన్ టీమ్ లీడర్షిప్ కోఆర్డినేటర్ లయన్ పుట్టా విజయశ్రీ పాల్గొన్నారు.
రూట్స్ పాఠశాల డైరెక్టర్లు కె.త్రిపాఠీ, ఎన్.వి. వి.ఎస్. సుధాకర్ వర్మ, బి. విద్యాకాంత్, ఉపాధ్యాయ బృందం, భారత్ బయోటెక్ కంపెనీ కోఆర్డినేటర్లు వేముల మురళి, ఠాగూర్ రాజేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. తణుకు పట్టణంలోని ఇతర పాఠశాలల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం సజ్జాపురం లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సందేశంతో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.




