వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేద్దాం:

పరాయి పాలన దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మనకు అపురూప కానుకలుగా అందించిన త్యాగధనులకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, దేశ సమగ్రతకు, ప్రగతికి ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంత్రి కందుల దుర్గేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు శకటాల ప్రదర్శనను తిలకించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు సాహితీ, సంస్కృతుల వికాసానికి, సంఘసంస్కరణ ఉద్యమాలకు పట్టుగొమ్మ అయిన తూర్పుగోదావరి జిల్లా దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందని, ఎందరో మహనీయుల నేతృత్వంలో జిల్లా ప్రజలు స్వేచ్ఛా సమరంలో కదంతొక్కారని మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాయంటూ… ప్రజలను ఉద్దేశించి కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో తూర్పుగోదావరి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రసంగం ద్వారా వివరించారు.

Scroll to Top
Share via
Copy link