వార్త‌లు

వెలగదుర్రులో ఎస్సీ కమ్యూనిటీ హాలు ప్రారంభించిన మంత్రి దుర్గేష్, ఏపిఎస్.ఎస్.డి.సి. చైర్మన్ శేషారావు

ఉండ్రాజవరం మండలం వెలగదుర్రులో బుధవారం రూ.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ భవనం రూ.10 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, రూ.4 లక్షల జడ్పీ నిధులు, రూ.5 లక్షల ఎంపీపీ నిధులు, రూ.5 లక్షల జడ్పీపీ నిధులతో నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు భారత రాజ్యాంగ […]

వార్త‌లు

బల్లిపాడు సొసైటీ చైర్మన్ గా సత్తిబాబు

త్రిసభ్య కమిటీని అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణరైతుల ప్రయోజనాలు కాపాడ విధంగా సొసైటీ అభివృద్ధికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. అత్తిలి మండలం బల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు ముత్తంశెట్టి సత్తిబాబు, ఇతర డైరెక్టర్లు ప్రగడ శ్రీనివాస్, అరిగెల నగేష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గతం నుంచి గ్రామస్తులు, రైతులు సహకారంతో సొసైటీ అభివృద్ధి

వార్త‌లు

సీఎం చంద్రబాబు నాయుడుతో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చాంబర్ లో రాధాకృష్ణ కలిసి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. తణుకు నియోజకవర్గం లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను, మంజూరు కావలసిన నిధులపై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే రాధాకృష్ణ చర్చించారు.

వార్త‌లు

దాతలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి

యల్లారమ్మ ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దాతలు ముందుకు రావాలని పిలుపు దాతలు, గ్రామస్తుల సహకారంతో యల్లారమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం మండపాక యల్లారమ్మ ఆలయంలో పిచ్చికల కోటేశ్వరరావు, లక్ష్మి దంపతులతో రూ. 2.50 లక్షలతో నిర్మించన మండపాన్ని, బలుసు కేశవస్వామి, పార్వతి దంపతుల పేరుతో ఎన్టీఆర్‌ సుజల స్రవంతిలో భాగంగా నిర్మించిన వాటర్‌ప్లాంటు, విశ్రాంతి, ప్రసాదాల వితరణ హాలును ఎమ్మెల్యే

వార్త‌లు

రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో రైతు సంబరాల్లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ 200 పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ప్రదర్శనరైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. రైతు సంబరాల్లో భాగంగా దాదాపు 200 పైగా ట్రాక్టర్లు ర్యాలీగా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మంగళవారం తణుకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వయంగా ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ చేస్తూ స్థానిక ఎన్టీఆర్‌ పార్కు నుంచి

వార్త‌లు

తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.

అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో రైతుల పెట్టుబడి అవసరాల కోసం ప్రతి ఏటా భూమి ఉన్న ప్రతి రైతుకు రూ. 20వేల చొప్పున అందించనున్న ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా మొదటి విడతగా రూ. 7 వేలు జమ అయిన సందర్భంగా రైతులు నియోజవర్గం రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రాక్టర్లతో ర్యాలీ. తణుకు ఎన్టీఆర్ పార్క్ నుండి బయలుదేరి ఎన్.ఎస్.సి బోస్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, ఆపిల్ ఆస్పటల్ మీదుగా పాలిటెక్నిక్ కాలేజ్,

వార్త‌లు

తణుకులో భక్తిశ్రద్ధలతో హరేకృష్ణ మహోత్సవం

హాజరైన ఎమ్మెల్యే ఆరెమెల్లి రాధాకృష్ణ ఇస్కాన్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రాధాకృష్ణశ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇస్కాన్‌ ఆధ్వర్యంలో తణుకులో సోమవారం రాత్రి భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి మురళీనాథ్‌ శ్యామ్‌ దాస ఆధ్వర్యంలో స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసస్కాన్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ మహోత్సవంలో హరినామ సంకీర్తన,

వార్త‌లు

రైతు వ్యతిరేక విధానాలతో వైసీపీ పాలన

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్‌ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం తణుకు ఏఎంసీ పాలకవర్గం అభినందన సభ తణుకులో ఏఎంసీ యార్డు నిర్మాణానికి చర్యలు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ గత అయిదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన మొత్తం రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు దగా పార్టీగా వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని మొత్తం మూత వేసేలా అప్పటి పాలకులు వ్యవహరించాలని విమర్శించారు. తణుకు మార్కెట్‌

వార్త‌లు

అన్ని వర్గాలను అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలి ఏఎంసీ ఛైర్మన్‌ దాసం ప్రసాద్‌ ప్రమాణస్వీకారం పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌అధికార దాహంతో గత అయిదేళ్ల కాలంలో అన్ని వర్గాలకు అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ

వార్త‌లు

పెన్షనర్లకు అండగా కూటమి ప్రభుత్వం

అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. మున్సిపల్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో నిర్వహించిన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

Scroll to Top