వార్త‌లు

మద్యం షాపులలో, బార్లలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర లో భాగంగా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత ఆదేశాల మేరకు ఈ రోజు తణుకు పట్టణములో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మద్యం షాపులలో, బార్లలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ […]

వార్త‌లు

అత్తిలి మండలంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలంలోని బొంతు వారి పాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ కూడా సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టినట్లయితే ఎలుకలకు సమర్థవంతంగా నియంత్రించవచ్చని అందుకే రైతులందరూ ఒక మాట మీద ఉండి అందరూ ఒకేసారి ఎలుకల మందు పెట్టినట్లయితే ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని అలాగే ఎలుకలు నియంత్రణకు పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చని తెలియజేశారు. అలాగే రైతులందరూ యూరియా వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని

వార్త‌లు

తణుకులో ఘనంగా వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బుధవారం సాయి స్కూల్ ప్రాంగణంలో వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరజ్వాల ఆంధ్ర ప్రజల హృదయ జ్వాల వావిలాల గోపాలకృష్ణయ్య అని అన్నారు. ఈ సందర్భంగా వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని సాయి స్కూల్ డైరెక్టర్ గురు మురళీకృష్ణ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం స్కూలు డైరెక్టర్ మురళీకృష్ణ

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం సందర్భంగా ఉచితంగా చీరలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శాసనసభ్యులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ జన్మదిన సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తనయుడు డా.కందుల కృష్ణ తేజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి తన తండ్రి అయిన కందుల

వార్త‌లు

ఘనంగా మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు

నిడదవోలు పట్టణంలోని లయన్స్ క్లబ్‌లో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు, అభిమానులు మంత్రి దుర్గేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విజ్జేశ్వరం నుండి నిడదవోలు వరకు ర్యాలీగా వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ లయన్స్ క్లబ్‌కి చేరుకోగానే సర్వమత ప్రార్థనలతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా

వార్త‌లు

తణుకులో ఘనంగా ప్రారంభమైన విశ్వకర్మ జయంతి వేడుకలు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు వేంచేసిన శ్రీ మద్ విరాట్ విశ్వకర్మ స్వాముల వారి యజ్ఞోత్సవములు అత్యంత వైభోగంగా ప్రారంభమైనవి. తొలుత స్థానిక శుభం గ్రాండ్ దగ్గర ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ చే విశ్వకర్మ పతాకావిష్కరణ జరిపినారు. తదుపరి ఊరేగింపుగా బయలుదేరి గుడి వద్దకు వెళ్లి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరియు కలశ స్థాపన చేసి హోమం పూజలు నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ తెలిపినారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ముండూరి వీరభద్రాచార్యులు

వార్త‌లు

రెరా సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిరావు

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేట్‌ అథారటీ (రెరా) సభ్యుడిగా తణుకు పట్టణానికి చెందిన టిడిపి పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ మంత్రిరావు వెంకటరత్నం (బాబు) నియామకం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రెరా ఛైర్మన్‌ ఎ.శివారెడ్డితోపాటు సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రెరా ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.

వార్త‌లు

మహిళ ఆరోగ్యంతోనే సమాజం అభివృద్ధి

‘స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’లో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రభుత్వాసుపత్రిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే గర్భిణీలకు సీమంతాలు చేసిన రాధాకృష్ణ ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ సభ్యులతోపాటు సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుని మహిళను ఉన్నతంగా తీర్చిదిద్ది తద్వారా ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. దేశవ్యాప్తంగా స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని బుధవారం తణుకు జిల్లా

వార్త‌లు

సరేంద్రమోదీ జీవితం స్ఫూర్తిదాయకం

తణుకులో మోదీ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ పేదరికంలో పుట్టిన నరేంద్రమోదీ చాయ్‌వాలాగా పని చేసి బీజేపీలో చేరి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తణుకులో బుధవారం ఏర్పాటు చేసిన పలు సేవాకార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గుజరాత్‌ రాష్ట్రానికి 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఆయన

Scroll to Top