వార్త‌లు

తణుకు ముళ్ళపూడి ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాల బాలికలకు ఉచిత వైద్యపరీక్షలు

ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ నందు ఏర్పాటుచేసిన మహా ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మంగళవారం శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ (మెడికల్ ట్రస్ట్) నందు ముళ్ళపూడి తిమ్మరాజు హైస్కూల్ నందు 8, 9 ,10 తరగతి చదువుతున్న 72 మంది విద్యార్థిని విద్యార్థులకు దంత విభాగము, కంటి విభాగము, గైనిక్ విభాగములలో ఉచితముగా వివిధ పరీక్షలు జరిపి బాల బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి దంతాల పరిశుభ్రత వ్యక్తిగత […]

వార్త‌లు

తణుకు ముళ్ళపూడి ట్రస్ట్ హాస్పిటల్ లో మహా ఉచిత వైద్యశిబిరం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వెంకటరాయపురంలో, ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులు, “ఆంధ్రా బిర్లా” గా ప్రసిద్ధులైన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా మహా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించబడ్డాయి. శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ (ట్రస్ట్) హాస్పిటల్, తణుకు, ముళ్లపూడి వెంకటరాయుడు ఐ సెంటర్, ముళ్లపూడి కమలాదేవి కార్డియాక్ సెంటర్, కిమ్స్ (బొల్లినేని), రాజమండ్రి సహకారంతో సొమవారం నిర్వహించిన ఈ మహా వైద్యశిబిరంలో పేదలు మరియు ఆర్థికంగా వెనుకబడినవారికి ఉచిత వైద్య

వార్త‌లు

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

తిరుమల, తిరుపతి పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి తిరుపతి: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన సేవలో మంత్రి దుర్గేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాప వినాశనం వెళ్లే దారిలో జాపాలి తీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి సేవకు విచ్చేసిన నిడదవోలు వాసులు

వార్త‌లు

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా సి.నా.రే జయంతి

ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షరాన్ని నడిపించడం ఆయనకు ఇష్టం, సాహిత్యం అంటే ప్రాణం అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కందుకూరి పద్మావతి మాట్లాడుతూ తెలుగు భాషకు సుగంధం తెచ్చి జాతీయస్థాయిలో తెలుగు సాహిత్య కీర్తిని చాటిన వ్యక్తి డాక్టర్

వార్త‌లు

తిరుమలలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన నిడదవోలు వాసులు

తిరుమల శ్రీవారి సేవలో నిడదవోలు సేవకులు విశేష సేవలు అందిస్తున్నారని అభినందన మూలవిరాట్ కు నిర్వహించే ప్రసిద్ధమైన అర్చనసేవలో పాల్గొన్న అనంతరం తిరుమలలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన మంత్రి దుర్గేష్ తిరుమల : తిరుమలలో పర్యటిస్తున్నపర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను శ్రీవారి సేవ నిమిత్తం తిరుమలకు వచ్చిన నిడదవోలుకు చెందిన ఓ మహిళా బృందం కలిసింది. ఈ సందర్భంగా తిరుమలలో తోటి యాత్రికులకు నిస్వార్థంగా ఉచిత సేవను అందిస్తూ అధ్యాత్మిక భావంలో

వార్త‌లు

ఘనంగా ఆంధ్ర బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి

స్వతంత్రం రావడానికి ముందే గోదావరి జిల్లాలో పారిశ్రామిక అబివృద్ధికి బీజం వేసిన అభినవ ఆంధ్రా బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతిని తణుకులో బి.జే.పినాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డా.ముళ్ళపూడిరేణుక ఆధ్వర్యంలో సొమవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహాల వద్ద ఏర్పాటుచేసిన సభలో డా. ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ (హరిబాబు)తో ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్ని తనదైనశైలిలో ముందు చూపుతో

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ లో డా.ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా జరిగిన చిన్న పిల్లల మెడికల్ క్యాంప్.

తణుకు, జూలై 28, 2025 : కీ.శే. “శర్కర కళాప్రపూర్ణ” డా.ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 104 వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక రోటరీ క్లబ్ వత్సవాయి వెంకట రాజు, సత్యవతి భవనం లో శ్రీ చక్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్న పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకట కృష్ణారావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత కలగర వెంకట కృష్ణారావు, రోటరీ క్లబ్ నాయకులు, సభ్యులు కీ.శే. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

వార్త‌లు

ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యత పై దేశవ్యాప్త రాజకీయ కుట్ర

విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వందమందిలో కేవలం నలుగురికి లబ్ధి జరుగుతుంది మిత్రులారా, ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే, ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలు, నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా, మోడీ, చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మిత్రులారా, ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు

వార్త‌లు

ఇగో పాలన దేనికి? చంద్రబాబు

41వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ లో వాసుపల్లి విశాఖపట్నం: జూలై 27 (కోస్టల్ న్యూస్) ఇగోతో జగనన్న పథకాలు అమలు చేయలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 41 వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద ఆదివారం బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

వార్త‌లు

తణుకులో ఘనంగా తల్లిదండ్రుల దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ప్రాంగణంలో పేరెంట్స్ డే ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ భవితకు భరోసా జీవితానికి దిక్సూచి తోడునీడగా ఉండేది అమ్మానాన్నలే అని అన్నారు. పేరెంట్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం సంస్థ సన్మానం అందుకున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు సన్మాన గ్రహీత ఆలపాటి సుబ్బారావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి నడత నేర్పిన తండ్రికి కనిపించే

Scroll to Top