వార్త‌లు

పాలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలంలోని పాలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని అలాగే నానో యూరియా వినియోగించాలని తద్వారా నూటికి నూరు శాతం నత్రజని ఆకుల ద్వారా వరిపంట తీసుకుంటుందని తెలియజేశారు. అలాగే అక్కడక్కడ బ్యాక్టీరియా ఆకు ఎండతెగులు లక్షణాలు కనిపిస్తున్నాయని దాని నివారణకు ప్లాంటమైసిన్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ తెగులు మందులు వినియోగించి పిచికారి చేయాలని […]

వార్త‌లు

అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ అత్తిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. అత్తిలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కేకు కట్ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని దాసం ప్రసాద్ చేస్తున్న సేవా

వార్త‌లు

కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కీలక పాత్ర

అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవంగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తణుకు నినియోజకవర్గ

వార్త‌లు

నిడదవోలులో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా…. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు. అనంతరం నిడదవోలు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం రొట్టెలు, పండ్లు అందజేయడం జరిగింది. నిడదవోలు పట్టణ వై.యస్.ఆర్ కాలనీలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్

వార్త‌లు

మానవునికి నాగరికత నేర్పిన ఎంతో నైపుణ్యం కలిగిన వృత్తి టైలరింగ్

ఈ సమాజంలో మానవునికి నాగరికత నేర్పిన ఎంతో నైపుణ్యం కలిగిన వృత్తి టైలరింగ్ మాత్రమేనని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు కొనియాడారు. వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువతపై రెడీమేడ్ దుస్తులు ప్రభావం ఎక్కువగా ఉన్నదని దీంతో ఏళ్ల తరబడి టైలరింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న

వార్త‌లు

ముళ్ళపూడి రేణుకను అభినందించిన బిజేపి నాయకులు

తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ ఆర్.అనుకుమార్, ప్రధాన కార్యదర్శి బుద్దాల రాజ్యలక్ష్మి, పట్టణ కార్యదర్శి బడేటి సాయిరాం, తణుకు పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, పట్టణ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు మంగరాతి నాగేశ్వరరావు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుకను ఆమె నివాసంలో కలిసి

వార్త‌లు

మూడు దశాబ్ధాల్లో ఎన్నో సంస్కరణలు

చంద్రబాబు తొలి సంతకం చేసి 30 ఏళ్లు అభినందనలు తెలిపిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మూడు దశాబ్థాల కాలంలో నాలుగు పర్యాయాలు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు ఎన్నో సంస్కరణలకు తెర తీశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృçష్ణ అన్నారు. చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. దేశంలోనే సంచలనం సాధించిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమంతోపాటు గతంలో ఎప్పుడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో

వార్త‌లు

తణుకులో సినీగేయ రచయిత ఆరుద్ర శతజయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక తణుకు అంగన్వాడి కేంద్రం అర్బన్ సెంటర్ ప్రాంగణంలో సినీగేయ రచయిత ఆరుద్ర శతజయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య కారణజన్ముడు ఆరుద్ర గీతి మానవత్వానికి జాగృతి అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సన్మాన గ్రహీత కవి సంకు మదన గోపాల్ మాట్లాడుతూ సినీ కవిగా ఆణిముత్యాలు వంటి పాటలు ఎన్నో ఆరుద్ర రాశారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆరుద్ర

వార్త‌లు

రాష్ట్రంలోని సగానికి పైగా బార్లకు లైసెన్సుల జారీ కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే

రాష్ట్రంలోని సగానికి పైగా బార్లకు లైసెన్సుల జారీ కోసం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. మొత్తం 840 బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 388 (46.20%) బార్ లకే శనివారం లాటరీ తీసి లైసెన్సుదారులను ఖరారు చేశారు. మిగతా 452 (53.80%) బార్లకు నిబంధనల ప్రకారం కనీసం నాలుగేసి దరఖాస్తులు రాకపోవటంతో లాటరీ తీయలేదు. దీంతో అవి మిగిలిపోయాయి. వీటిల్లో 37 బార్లకు మాత్రం ఒకటి, రెండు చొప్పున

వార్త‌లు

సింగపూర్‌ తెలుగు సమాజం స్వర్ణోత్సవ వేడుకలు

మాజీ అధ్యక్షుడి హోదాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగు వారు ఎక్కడ ఉన్నా మత తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సింగపూర్‌ తెలుగు సమాజం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింగపూర్‌ మరీనా బే సౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సింగపూర్‌ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడి హోదాలో పాల్గొని మాట్లాడారు. సింగపూర్‌లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు అంతా కలిసికట్టుగా

Scroll to Top