రొడ్డు ప్రమాదంలో మండలపరిషత్ ఉద్యోగి దుర్మరణం
ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న డి.వి.వి.ఎస్ శర్మ (50) అకస్మిక మరణం అత్యంత విషాదకరమని ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు ఆవేదన వెలిబుచ్చారు. కార్యాలయం నుండి మధ్యాహ్నం భోజనానికి బయలుదేరిన శర్మ కు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవగా స్థానికులు, తోటి ఉద్యోగులు అత్యవసర వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు […]




