వార్త‌లు

తణుకు రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి విజయకేతనం ఎగుర వేసారని స్కూలు ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన 197 విద్యార్థుల్లో 596 మార్కులు సాధించిన విద్యార్థిని పి.బాల సత్య హరిణి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచింది. సి. హెచ్. యోషిత, ఆర్.ఎస్.ఎస్.ఎస్.చైతన్య 591 మార్కులు, బి.వేణు గోపాల్ మరియు వి.కార్తీక్ 590 మార్కులు సాధించారు. 580 కి […]

వార్త‌లు

133వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

133వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో నేరుగా మమేకమవుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సామాన్య ప్రజల విజయకథలు, మారుమూల ప్రాంతాల పురోగతిని పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు

వార్త‌లు

ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే ఐదేళ్లు కీలకం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆదివారం తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందనలు

వార్త‌లు

క్యాన్సర్ నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలి

ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి 114 మంది యువతులకు ఉచితంగా హెచ్ పీ వీ వ్యాక్సినేషన్ క్యాన్సర్ నివారణ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. ఆదివారం సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ఆసుపత్రి ఆవరణలో 114 మంది యువతులకు గర్భాశయం క్యాన్సర్ నివారణకు హెచ్ పీ వీ వ్యాక్సిన్ మొదటి డోస్ ను ఉచితంగా అందజేశారు. ఈ

వార్త‌లు

తణుకులో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు

పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం తణుకు పట్టణంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ఆదిశక్తి స్వరూపిణిగా, అహింసను పరమధర్మంగా ఆచరించి ఆత్మగౌరవం కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నత దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారని కొనియాడారు. సమాజంలో

వార్త‌లు

పట్టాలు ఇచ్చారు స్థలాలు ఎక్కడున్నాయి చూపాలి అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేలంగి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు లబ్ధిదారులు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించి కార్యదర్శికి మెమోరాండం ను అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వరేలంగి గ్రామంలో సుమారు 350 మందికి పట్టాలు ఇచ్చారని ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఇల్లు నిర్మాణము చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . అంతన్నవారిపేటలో సుమారు 120 మందికి పట్టాలు ఇచ్చిన దారి మార్గం ఏర్పాటు చేయలేదని

Scroll to Top