డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 38 మద్యం దుకాణాలను మరియు 3 బార్లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పదంగా గల సంఘటనలు ఏమియు నమోదు కాలేదని, అన్ని మద్యం షాపులు, బార్ల నుండి శాంపిల్స్ సేకరించడం జరిగిందని తెలిపారు. మద్యం షాప్ యజమానులు అన్ని నిబంధనలు ఖచ్చితముగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు ఎవరికైనా సుంకం చెల్లించని, ప్రమాదకరమైన మద్యం నిల్వలు గురించి సమాచారం ఉన్నట్లయితే తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 9440902436 వారికి సమాచారం అందించవలసిందిగా తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.


