ఇరగవరం పి. హెచ్. సి.లో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం

ఇరగవరం పి హెచ్ సి నందు మంగళవారం ఆశా డే మీటింగ్లో ఈగల్ టీం, టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలకు పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వై. మౌనిక మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వాడకంవలన కలిగే దుష్పరిణామాలను, సైబర్ క్రైం నుండి ఎలా రక్షించుకొవాలో తెలిపారు. సైబర్ క్రైన్ జరిగిన మొదటి అరగంటలో 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయడం ద్వారా నష్టాన్ని భర్తీచేసుకొవచ్చు అన్నారు. ఈ అవగాహన సదస్సులో సిహెచ్ఓ ఎస్. కె. కాన్ సాహెబ్, పి హెచ్ ఎన్ ఏ. రాణి, ఈగల్ టీం నాగేశ్వరావు, ఎన్. టి.సి పి.జి.సాదు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link