అసంఘటిత కార్మికులుగా వున్న కొబ్బరి ఒలుపు, దింపు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వారి అభివృద్ధికి సమగ్ర శాసనం తేవాలని తణుకు ఏరియా కొబ్బరి ఒలుపు, దింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు.మంగళవారం చుక్కవానితోట గ్రామం కొబ్బరి తోటలో జరిగిన తణుకు ఏరియా కొబ్బరి దింపు ఒలుపు కార్మిక సంఘం కమిటీ సమావేశంలో భీమారావు మాట్లాడుతూ కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులు చెట్లు ఎక్కుతూ దిగుతూ ప్రమాదాలకు గురయ్యే వారికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, అంగ వైకల్యం గురైన కార్మికులకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని భీమారావు కోరారు.
కొబ్బరి దింపు, ఒలుపు కార్మిక సంఘం తణుకు ఏరియా అధ్యక్షుడు బొక్కా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో సంఘం కార్యదర్శి కౌరు శ్రీను, పెచ్చెటి రాజు, కేతా పాండురంగారావు, వేండ్ర దానయ్య, బొక్కా భాస్కరరావు, కేతా సత్యనారాయణ, బొక్కా కృష్ణ, దొంగ దానయ్య, తంగెళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


